బీజేపీ సీనియర్ నేత, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుపై గత కొంత కాలంగా ఆయన పార్టీ మారతాడని, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగుతాడని, అందుకే ఏపీలో బీజేపీ ఏమైపోయినా ఆయన పట్టించుకోవడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పుమన్నాయి. అంతేకాదు, ఇటీవల కాలంలో కొన్ని మీడియాల్లో అయితే, కామినేని చూపు టీడీపీ వైపు అంటూ కథనాలు వచ్చేశాయి. ఈ జోరు రోజు రోజుకు పెరుగుతుండడంతో తట్టుకోలేక పోయారో ఏమో .. […]
Tag: TDP
నంద్యాలలో ఓటర్ల క్యూలే క్యూలు.. బాబు, జగన్కు టెన్షన్… టెన్షన్
నిన్ని మొన్నటి వరకు అందరూ రావాలి ఓటు హక్కు వినియోగించుకావాలి.. అంటూ భారీ ఎత్తున రీసౌండ్ వచ్చే మైకులు పెట్టుకుని మరీ ఊరూ వాడా తిరుగుతూ నంద్యాల జనాల చెవుల్ని హోరెత్తించిన టీడీపీ, వైసీపీల్లో తీరా ఇప్పుడు ఓటింగ్ మొదలయ్యే సరికి భయం పట్టుకుంది! దీనికి కారణం నంద్యాల ఓటర్లే!! గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో నంద్యాల ఓటర్లు.. పోలింగ్ బూతుల ముందు క్యూల మీద క్యూలు కట్టారు. పండు ముసలోళ్ల నుంచి యువకులు, […]
టీడీపీకి ఆ హీరోయిన్ గుడ్ బై..!
ఏపీలో అధికార టీడీపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. జంపింగ్ జపాంగ్లు ఎక్కువవ్వడంతో ఇప్పటికే చంద్రబాబుకు చాలా నియోజకవర్గాల్లో తలనొప్పులు ఎక్కువయ్యాయి. వీటికి తోడు పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో ఉన్న వాళ్లు సైతం పార్టీని వీడి వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నారు. నిన్నటి తరం హీరోయిన్, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన కవిత ఏపీలో అధికార టీడీపీకి త్వరలోనే గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీలో కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు […]
నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ..వైసీపీ వెర్షన్ ఒకలా.. టీడీపీ వెర్షన్ మరోలా
తెలుగు జనాలు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో వెయిట్ చేస్తోన్న ఏపీలోని నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ బుధవారం తీవ్ర ఉత్కంఠ మధ్ స్టార్ట్ అయ్యింది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ 10 గంటలకే అనధికారికంగా 22 శాతం వరకు పూర్తయినట్టు తెలుస్తోంది. నంద్యాల ఓటరు మంచి హుషారుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బూత్ల వద్ద బారులు తీరారు. ఇక నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో కొన్ని గ్రామాల్లో అయితే 10 గంటలకే 40-50 […]
బాబు `ముందస్తు` ప్రణాళిక తెలిస్తే షాకే!!
నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం మాదే అంటే మాదే అని టీడీపీ, వైసీపీ ధీమాగా ఉన్నాయి. అంతేగాక ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందో అని లెక్కలు కూడా వేసేసుకుంటున్నాయి. తన మూడేళ్ల పాలనకు ఈ ఎన్నికల్లో గెలుపే నిదర్శనమని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే టీడీపీకి 15 వేల మెజారిటీ వరకూ వస్తుందని అంతర్గత సర్వేల్లో తేలింది. అది సరిపోదని ఇంకా పెంచాలని నేతలను ఆయన ఆదేశించడం గమనిస్తే.. సరికొత్త వ్యూహంలో […]
నంద్యాలలో టీడీపీని ఓడించాలని గోదావరి జనాల ర్యాలీ
నంద్యాలలో టీడీపీని ఓడించాలని వైసీపీ వాళ్లు, వైసీపీని ఓడించాలని టీడీపీ వాళ్లు రకరకాల స్కెచ్లు వేస్తున్నారు. అక్కడ స్కెచ్లు అలా ఉంటే కర్నూలు జిల్లాకు అవతల జిల్లాలకు చెందిన జనాలు కూడా నంద్యాలలో వైసీపీకి ఓట్లేసి టీడీపీని ఓడించాలని ర్యాలీలు చేస్తుండడం విశేషం. గోదావరి జిల్లాల పేరు చెపితే అధికార టీడీపీకి ఎంత కంచుకోటలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పశ్చిమగోదావరి జిల్లా పేరు చెపితే మొత్తం పసుపే గుర్తుకు వస్తుంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో 15 అసెంబ్లీ […]
టార్గెట్ : ముస్లింలు వైసీపీకి దూరం… అందుకే పొత్తు కథనాలు!
ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు విమర్శలే ఒక్కొక్కసారి పనిచేయవు.. వారిని దెబ్బకొట్టేందుకు అనేక మార్గాలుంటాయి. అలాంటి మార్గాలను బాగా ఒంటబట్టించుకున్న ఎల్లో మీడియా.. వాటిని ఆధారంగా చేసుకునే వైసీపీని చావు దెబ్బకొట్టేందుకు ప్రయత్నించింది. తాజాగా నంద్యాల పోరు పీక్ స్టేజ్కి చేరిపోయిన నేపథ్యంలో అధికార టీడీపీ, విపక్షం వైసీపీల మధ్య గెలుపు ఓటములు కేవలం ముస్లిం మైనార్టీ ఓట్ల మీదనే ఆధారపడ్డాయి. ఈ వర్గం వారు ఎటు మొగ్గితే ఆ పార్టీ సునాయాసంగా విజయం సాధించేందుకు అవకాశం ఉంది. అయితే, […]
రోజాకు బొండా ఉమా బోడి గుండు సవాల్… రోజా దిమ్మతిరిగే కౌంటర్
నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి పరాకాష్టగా మారింది. ముఖ్యంగా అటు టీడీపీ ఫైర్ బ్రాండ్గా తననుతాను చిత్రీకరించుకున్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాకి, వైసీపీ లేడీ టైగర్ రోజాకి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు పొలిటికల్ హీటును పెంచేశాయి. ముఖ్యంగా నంద్యాల ఉప పోరులో చివరి ప్రచారదినం సోమవారం నాడు.. ఈ నేతలు మరింతగా రెచ్చిపోయారు. నంద్యాలలో టీడీపీ గెలుపు ఖాయమని బొండా ఉద్ఘాటించారు. ఇంత వరకు బాగానే […]
ఈ దెబ్బతో గంటా గ్యాంగ్ను బాబు పక్కన పెట్టేయడం కన్ఫార్మ్..!
ఏపీలో మంత్రి గంటా శ్రీనివాసరావు చుట్టూ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఏదో ఒక ఆరోపణ సహజంగానే వస్తోంది. ఇప్పుడు కూడా ఆయన చుట్టూ భూకబ్జా ఆరోపణలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన విశాఖ భూ కుంభకోణాలు అన్నీ మంత్రి కనుసన్నల్లోనే సాగిపోతున్నాయట. ఆయన అనుచరులు కొందరు గంటా చెప్పిన ప్రకారం భూములను ఆక్రమించేసి.. వెంచర్లు వేసేస్తున్నారట. దీంతో మంత్రి గారి అవినీతి పుంఖాను పుంఖానులుగా రాజధానిలో హల్ చల్ చేస్తున్నాయి. […]