సంపత్‌ నంది ‘రచ్చ’ చేసేస్తాడా? 

యంగ్‌ డైరెక్టర్స్‌లో మంచి విజన్‌ ఉన్న దర్శకుడిగా సంపత్‌ నంది పేరొందాడు. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’, ‘బెంగాల్‌ టైగర్‌’ ఈ మూడు చిత్రాలతో సినీ పరిశ్రమ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. తృటిలో తప్పిపోయిందిగానీ లేదంటే ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ ఛాన్స్‌ మొదట సంపత్‌ నందికే దక్కింది. సంపత్‌ నంది అంటే మినిమమ్‌ గ్యారంటీ డైరెక్టర్‌. సరైన ఛాన్స్‌ కోసం చూస్తున్న ఈ యంగ్‌ డైరెక్టర్‌, గోపీచంద్‌తో సినిమాకి కమిట్‌ అయ్యాడు. ఇంకో వైపున సంపత్‌ నందితో ఇంకోసారి వర్క్‌ […]

భారీ బడ్జెట్‌తో చరణ్ సినిమా?

రామ్‌చరణ్ లీడ్‌లో సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ పిక్చర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఈ సినిమాకి దాదాపు రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నారన్న వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. సినిమా నిర్మాణానికి ఈ స్థాయిలో ఖర్చు చేస్తే, ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో ఉండాలి. ఇప్పుడిదే విషయమై నిర్మాతలు చర్చోపచర్చలు సాగిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం చరణ్-సుకుమార్‌లిద్దరూ ఎవరి ప్రాజెక్ట్‌లతో వారు బిజీగా ఉన్నారు. ‘ధృవ’ […]

రామ్‌చరణ్‌కి మెగా టెన్షన్‌

రాజకీయాల నుంచి కొంచెం గ్యాప్‌ తీసుకుని ఇప్పుడే చిరంజీవి తన 150వ సినిమా మీద దృష్టి పెట్టాడు. తన బాడీ లాంగ్వేజ్‌నంతటినీ సినిమా హీరోకి తగ్గట్టుగా మార్చుకున్నాడు. ఇంక రేపో, మాపో ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుంది. ఈలోగా రాజకీయాల వైపు నుంచి వచ్చే ఉపద్రవాలు చిరంజీవిని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. క్షణం తీరిక లేకుండా తన టైం అంతా రాజకీయాలకే పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. కాపు ఉద్యమంతో చిరంజీవి ఎక్కువగా ఈ […]

పోలిస్ స్టేషన్ లో చెర్రీ

పోలీసు కథలంటే మన కథానాయకులకు చాలా మక్కువ. అసలు సిసలైన హీరోయిజం చూపించే అవకాశం ఈ కథల్లోనే ఎక్కువ దొరుకుతుంది. మాస్‌కి త్వరగా దగ్గరైపోవొచ్చు. దానికి తోడు స్టైలిష్‌గానూ కనిపించొచ్చు. అందుకే రామ్‌చరణ్ మరోసారి ఖాకీ కట్టేశారు. పోలీసు స్టేషన్‌లో హంగామా మొదలెట్టారు. రామ్‌చరణ్ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రకుల్‌ప్రత్‌సింగ్ కథానాయిక. అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. నవదీప్ కీలక పాత్రధారి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. పోలీస్ స్టేషన్ […]

రెండేళ్ళు ఫిక్స్ అయిన చరణ్

‘బ్రూస్‌లీ’ సినిమా తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమాపై దృష్టి పెట్టాడు రాంచరణ్‌. ఆ సినిమా ప్రారంభోత్సవం దగ్గర్నుంచీ, సినిమాకి సంబంధించిన అన్ని విషయాలనూ దగ్గరుండి చూసుకున్నాడు . ఇక తండ్రి సినిమా సెట్స్‌ మీదికెళ్లింది. దాంతో తన సినిమాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక నుంచీ చరణ్‌ రెండేళ్లదాకా ఖాళీగా ఉండడట. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా నాలుగు సినిమాల్ని చేసెయ్యనున్నాడు. ఇప్పటికే వీటన్నింటికీ కథల్ని సిద్ధమయిపోయాయట. ప్రస్తుతం ‘తనీ ఒరువన్‌’ రీమేక్‌ ‘ధృవ’లో నటిస్తున్నాడు. […]