వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం నిన్నటి వరకు సీనియర్ రాజకీయ నాయకుల వారసులను వరుసగా తన పార్టీలో చేర్చుకున్న జగన్ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో వారికి ఒక్కొక్కరిగా షాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది. జగన్ కొద్ది రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దివంగత సీనియర్ మంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీథర్కు ఏలూరు లోక్సభ నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగించారు. శ్రీథర్ సైతం వచ్చే ఎన్నికల్లో ఏలూరు వైసీపీ ఎంపీ టిక్కెట్టు తనదే అన్న […]
Tag: Politics
నోరుజారారు.. పదవి పోగొట్టుకున్నారు
అధికారిక రహస్యాలు బయటికి వెల్లడించకూడదు.. అందులోనూ పార్టీలో అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలు అందరికీ చెప్పేస్తే ఎలా ఉంటుందో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి బాగా తెలిసి వచ్చుంటుంది. రాజకీయాల్లో నోరుజారకూడదు.. పాపం అలా చేసినందుకే ఆయనకున్న చీఫ్ విప్ పోస్టు కూడా పోయిందనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. పల్లె రఘునాథరెడ్డి అత్యుత్సాహం ఇప్పుడు ఆయనకున్న ఒక్కగానొక్క పదవి కూడా పోయేలా చేసిందనే గుసగుసలు అసెంబ్లీ లాబీల్లో వినిపిస్తున్నాయి. మంత్రి పదవి పోయినందుకే తీవ్ర మనోవేదనతో ఉన్న పల్లె […]
ఆ జిల్లా అధ్యక్ష పదవికి ఇంత పోటీనా?
ప్రకాశం జిల్లా టీడీపీలో నాలుగు స్తంభాలాట మొదలైంది. దీనికోసం పార్టీలోని సీనియర్లు, కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు జోరుగా పావులు కదుపుతున్నారు. ఈ పీఠాన్ని దక్కించుకుని తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎవరికి వారు లాబీయింగ్ చేసుకుంటూ.. హైకమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం ఒకరు.. గుర్తింపు కోసం మరొకరు.. ఇలా ఎవరి అవసరాలు వారివి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. హైకమాండ్ ఆశీస్సులు పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రకాశం […]
సోషల్ మీడియాకు లోకేష్ మళ్లీ దొరికారా?
పార్ట్ టైం పొలిటీషియన్.. ఈ పదం ఏపీ రాజకీయాల్లో విపరీతంగా వినిపిస్తోంది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో అడుగు లేస్తున్న టీడీపీ అధినేత తనయుడు, మంత్రి నారా లోకేష్ కొంతమందిని ఉద్దేశించి `పార్ట్టైం పొలిటీషియన్` అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడు. మరి పవన్ కోటా అయిపోయింది.. ఇప్పుడు జూనియర్ కూడా స్పందిస్తాడా? లేదా అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ లోకేష్పై సెటైర్లు పడుతున్నాయి. పార్టీలో […]
టీడీపీ మంత్రిని టార్గెట్ చేసిన బీజేపీ మంత్రి
ఏపీ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీజేపీ-టీడీపీ మధ్య మిత్ర బంధం తెగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత జగన్..ప్రధాని మోదీతో భేటీ అనంతరం అటు బీజేపీ, ఇటు టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసలే హీట్ పెరిగిపోతున్న సమయంలో కేబినెట్లోని బీజేపీ మంత్రి.. మరో టీడీపీ మంత్రిని టార్గెట్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లు మారింది. మద్యం అమ్మకాల విషయంలో తీవ్ర విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న […]
పవన్ అభిమానులకు తీపి, చేదు కబురు
అనుకున్నదంతా అయింది. రెండు పడవల మీద ప్రయాణం చేస్తాడనుకున్న తమ నాయకుడు పెద్ద బాంబు పేల్చాడు. అవసరమైతే సినిమాలు కూడా మానుకుంటానని తేల్చిచెప్పడంతో ఆయన అభిమానులంతా నిరాశ చెందారు. జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు తీపి కబురుతో పాటు చేదు కబురు కూడా అందించాడు. ఇప్పుడు సంబరపడాలో లేక నిరుత్సాహపడాలో తెలియక సతమతమవుతున్నారు. రాజకీయాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు పవన్. భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాడు. అంతేగాక తనను పార్ట్టైమ్ రాజకీయనాయకుడని విమర్శలు గుప్పిస్తున్న […]
వాకాటి గురించి వైసీపీ ముందే చెప్పిందా?!
అవినీతి ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఆ పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై జగన్ పార్టీ తీవ్రస్థాయిలో రెచ్చిపోయింది. వాకాటిని టీడీపీలోకి చే్ర్చుకునే ముందే తాము హెచ్చరించామని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. వాకాటిపై ముందు నుంచే కేసులు ఉన్నా టికెట్ ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రజల దృష్టిని మార్చేందుకే వాకాటిని టీడీపీ సస్పెండ్ చేసిందని ఆరోపించారు. గంటా శ్రీనివాసరావు, సీఎం రమేశ్, రాయపాటి సాంబశిరావులపై […]
మంత్రి పదవి పాయే…. ఎమ్మెల్యే టిక్కెట్టు కష్టమే..!
ఎన్నో ఆశలతో, మంత్రి హామీతో వైసీపీ నుంచి సైకిలెక్కిన ఎమ్మెల్యే పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడిలా మారిపోయిందట. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన పేరు పరిగనణలోకి కూడా తీసుకోకపోవడంతో ఇప్పటికే ఆయన అసంతృప్తిలో ఉన్నారట. పార్టీలో చేరే సమయంలో సీఎం చంద్రబాబు.. తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినా చివరి నిమిషంలో పట్టించుకోలేదట. ఇప్పుడు దీనికి తోడు.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే సీటు కూడా దక్కే అవకాశాలు లేకపోవడంతో ఏం చేయాలో […]
బాబుపై రాయపాటి వ్యాఖ్యల వెనుక రీజన్ ఇదే
విశాఖ రైల్వే జోన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎంపీలంతా ఒక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అయితే దీని నుంచి అర్ధంతరంగా బయటికొచ్చిన ఎంపీ రాయపాటి సాంబశివరావు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ రైల్వే జోన్ గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఎన్నిసార్లు భేటీ అవుతున్నా జోన్ ఎందుకు రావడం లేదని ఘాటుగానే ప్రశ్నించారు. అయితే చంద్రబాబుపై ఇంతలా ఆగ్రహం వ్యక్తంచేయడం వెనుక కారణం కూడా లేకపోలేదట. […]