`నంద్యాల‌`లో అఖిల‌ప్రియ‌ను ఒంట‌రి చేస్తున్నారా?

నంద్యాల ఉప ఎన్నిక మంత్రి భూమా అఖిల‌ప్రియ‌కు ప‌రీక్ష పెట్ట‌బోతోంద‌నే చ‌ర్చ టీడీపీలో మొద‌లైంది. త‌మ వ‌ర్గానికే సీటు కేటాయించాల‌ని అధిష్టానం వ‌ద్ద తీవ్రంగా ప‌ట్టుబ‌ట్టి.. చివ‌ర‌కు త‌న మాటే నెగ్గించుకున్నారు. అయితే ఇక్క‌డితోనే అయిపోలేద‌ని.. ఆ అభ్య‌ర్థిని గెలిపించుకుంటేనే ఆమె బ‌లం తెలుస్తుంద‌ని పార్టీ సీనియ‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా వైసీపీ కూడా ఈ ఉప ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని తీవ్ర ప‌ట్టుద‌ల‌తో ఉన్న త‌రుణంలో.. అఖిల‌ప్రియ‌ రాజ‌కీయ ప‌రిణితి, వ్యూహాల‌కు ఇదొక ప‌రీక్షలా మార‌బోతోంద‌ని అంతా భావిస్తున్నారు. […]

చంద్ర‌బాబు వ‌ద్ద మూడు పంచాయితీలు

ఏపీలో క‌ర్నూలు జిల్లా నంద్యాల రాజ‌కీయం అగ్నిమంటాకులా రాజుకుంది. ఇక్క‌డ టీడీపీలోనే గ్రూపులు ఎక్కువ‌వ్వ‌డంతో వ‌చ్చే ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ఇంకా పెద్ద స‌స్పెన్స్‌గానే ఉంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఇదే క‌ర్నూలు జిల్లాకు చెందిన మూడు పంచాయితీలు చంద్ర‌బాబు వ‌ద్ద చ‌ర్చ‌కు రానున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా ఎవ‌రిని బ‌రిలోకి దింపాల‌నేది ఇంకా తేల‌లేదు. ఇక్క‌డ రాజ‌కీయాల‌ను మంత్రి అఖిల‌ప్రియ స‌రిగా డీల్ చేయ‌లేక‌పోతోంద‌ని భావిస్తోన్న చంద్ర‌బాబు ఇక్క‌డ […]

చంద్ర‌బాబు తీరుతో నేత‌ల్లో ఆందోళ‌న‌

పార్టీ కోసం ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయిస్తాన‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్నా.. ఆచ‌ర‌ణ‌లో మాత్రం వాటిని ప‌ట్టించుకోవ‌డం లేదా? సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఏర్ప‌డుతున్న జాప్యం వ‌ల్ల పార్టీకి కొంత న‌ష్టం క‌లుగుతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాకు చెందిన శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరిన త‌ర్వాత‌.. పార్టీ శ్రేణుల్లో ఈ అంశాలపై విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత‌.. పార్టీలో అసంతృప్తుల సంఖ్య […]

నంద్యాల‌లో టీడీపీకి క‌ష్టాలు..!

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి త్వ‌ర‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి ఈ రోజు వైసీపీలో చేర‌డంతో ఇక్క‌డ బ‌లాబలాలు మారుతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ టీడీపీ మూడు గ్రూపులుగా ఉంది. ఈ మూడు గ్రూపుల్లో ఒక‌రికి మ‌రొక‌రితో అస్స‌లు పొస‌గ‌లేదు. భూమా వ‌ర్గం, శిల్పా వ‌ర్గం, మాజీ మంత్రి ఫ‌రూఖ్ ఇలా వీరు వేర్వేరు గ్రూపులుగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. అయితే ముగ్గురు […]

బాబు బాణం బాబుకే త‌గిలింది

ఏపీలో పార్టీని సంస్థాగ‌తంగా క‌న్నా నాయ‌కుల‌తో బ‌లోపేతం చేసేయాల‌ని క‌ల‌లు క‌న్న చంద్ర‌బాబు క‌ల‌లు రివ‌ర్స్ అయ్యాయి. ఏపీని అభివృద్ధి చేయ‌డం ద్వారానో లేదా పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయాల‌నో చూడ‌కుండా చంద్ర‌బాబు విప‌క్ష వైసీపీ వాళ్ల‌ను త‌మ పార్టీలో చేర్చేసుకుంటే ఇక్క‌డ ఎమ్మెల్యేల కౌంట్ పెరిగిపోతుంద‌ని లెక్క‌లు వేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీకి చెందిన ఒక‌రిద్ద‌రు ఎంపీల‌తో పాటు 21 మంది ఎమ్మెల్యేలు, కొంద‌రు ఎమ్మెల్సీలు అధికార పార్టీ చెంత చేరిపోయారు. చంద్ర‌బాబు అనుకున్న‌ట్టు ఇక్క‌డ […]

నంద్యాల రాజ‌కీయం మ‌ళ్లీ యూట‌ర్న్‌..!

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం ఏ రోజు ఎలా మ‌లుపులు తిరుగుతుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. వాస్త‌వానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ప‌దేళ్ల‌లో చాలా మంది నాయ‌కులు పార్టీలు ఫిరాయించారు. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన భూమానే తీసుకుంటే ఆయ‌న టీడీపీ – ప్ర‌జారాజ్యం – వైసీపీ తిరిగి టీడీపీ ఇలా చాలా పార్టీలు మారారు. గ‌త ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి మంత్రి ప‌ద‌వి హామీతో టీడీపీలోకి జంప్ చేశారు. రెండు […]

నంద్యాల‌లో మారిన వైసీపీ వ్యూహం

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ వ్యూహం మారింది. నిన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ వైసీపీ ఏక‌గ్రీవానికి స‌హ‌క‌రిస్తుంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. వాస్త‌వానికి ఇక్క‌డ గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున భూమా నాగిరెడ్డి విజ‌యం సాధించారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు సైకిలెక్కిన ఆయ‌న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముందే గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. భూమా మృతి త‌ర్వాత జ‌గ‌న్ ఇది వైసీపీ సీటు…ఇక్క‌డ వైసీపీ ఉప ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో […]

నంద్యాల బై పోల్ ఏక‌గ్రీవం వెన‌క విజ‌య‌మ్మ‌..!

ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌.. నంద్యాల ఉప ఎన్నిక‌! ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఇప్పుడు దీనికి బైపోల్ అనివార్య‌మైంది. అయితే, ఇది వైసీపీ గెలిచిన సీటు. త‌ర్వాత పొలిటిక‌ల్ కార‌ణాల నేప‌థ్యంలో భూమా టీడీపీ సైకిల్ ఎక్క‌డం.. అనూహ్యంగా ఆయ‌న మ‌ర‌ణించ‌డం తెలిసిందే. దీంతో ఇప్పుడు అటు టీడీపీ.. ఇటు వైసీపీల‌కు ఈ బైపోల్ ఛాలెంజ్‌గా మారింది. త‌మ పార్టీ సీటే కాబ‌ట్టి బైపోల్‌లో పోటీ చేసే అర్హ‌త త‌మకే ఉంద‌ని […]

అక్కడ ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో టీడీపీ

సీనియ‌ర్ నేత భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మృతితో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈ సీటు అధికార టీడీపీది కావ‌డంతో ఇక్క‌డ ఈ సీటును తిరిగి నిలుపుకునేందుకు టీడీపీ, ఇక్క‌డ నుంచి గెలిచిన భూమా వైసీపీ త‌ర‌పున గెల‌వ‌డంతో ఇక్క‌డ తిరిగి స‌త్తా చాటేందుకు వైసీపీ రెడీ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే టీడీపీ నుంచి ఇక్క‌డ అభ్య‌ర్థిగా ప‌లువురు పేర్లు విన‌ప‌డుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రి పేరు ఫైన‌లైజ్ కాలేదు. […]