చింత‌మ‌నేని గ్రాఫ్ ఎలా ఉంది…2019లో గెలుస్తాడా…

చింతమ‌నేని ప్ర‌భాక‌ర్‌రావు స‌మైక్య రాజ‌కీయాల్లో ఈ పేరు రాజ‌కీయాల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు నుంచి టీడీపీ త‌ర‌పున వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన చింత‌మ‌నేనికి కాంట్ర‌వర్సీ కింగ్‌గా పేరుంది. పార్టీలో సామాన్య కార్య‌క‌ర్త నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, విప్‌గా ఉన్న ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉంది. 2009 ఎన్నిక‌ల‌కు ముందు దెందులూరు జ‌డ్పీటీసీ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీని గెలిపించిన ఆయ‌న మంత్రి మాగంటి మంత్రి ప‌ద‌వి పోవ‌డానికి కార‌ణ‌మ‌య్యాడు. ఆ […]

అల్లుడు కోసం మామ త్యాగమా..! లేక గుడ్ బై నా..!

ప్ర‌ముఖ సినీన‌టుడు, ఏపీలోని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్ప‌నున్నారా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న హిందూపురం నుంచి మ‌రోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశంలో లేరా ? బాల‌య్య 2019 త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ఏపీ టీడీపీ వ‌ర్గాల్లో అవున‌నే ఆన్స‌రే వ‌స్తోంది. 2014 ఎన్నిక‌ల్లో త‌న తండ్రి గ‌తంలో ప్రాథినిత్యం వ‌హించిన హిందూపురం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలోకి […]

ఆ ఎమ్మెల్యే దంపతులు టీఆర్ఎస్ లో ఇమడలేక పోతున్నారా.!

వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ‌, ముర‌ళీ దంప‌తుల పేరు చెపితే స‌మైక్య రాష్ట్ర రాజ‌కీయాల్లోనే తెలియ‌ని వారు ఉండ‌రు. కాంగ్రెస్‌లో లేడీ ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న 1999, 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా గెలిచి వైఎస్ హ‌యాంలో మంత్రి అయ్యారు. వైఎస్‌తో సురేఖ దంప‌తుల‌కు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. 2008లో ఆమె వైఎస్ సూచ‌న మేర‌కు హ‌న్మ‌కొండ లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. త‌ర్వాత జ‌గ‌న్ వైసీపీలో చేరిన సురేఖ త‌న మంత్రి ప‌ద‌వి వ‌దులుకుని […]

12 మంది ఎమ్మెల్యేల‌కు బాబు స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు కోపం వ‌స్తే అటు ప‌క్క‌న ఎలాంటి వారున్నా ఆయ‌న ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌దు. తాజాగా ఏపీలో న‌వ‌నిర్మాణ దీక్ష‌ను ప్రారంభించాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఈ దీక్ష‌కు 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు డుమ్మా కొట్టారు. తాను ఎంతో సీరియ‌స్‌గా ఈ దీక్ష‌లో అంద‌రు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గోవాల‌ని పిలుపునిస్తే కొంత‌మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు త‌న మాట ప‌ట్టించుకోక‌పోవ‌డంతో చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. అమ‌రావ‌తిలోని త‌న […]

గుంటూరు జిల్లా హ‌త్య కేసు.. ప‌రారీలో ఆ పార్టీ ఎమ్మెల్యే

గుంటూరు జిల్లాలో సంచ‌ల‌నం రేపిన ఓ హ‌త్య కేసుకు సంబంధించి విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ప‌రారీలో ఉన్నారు. పల్నాడులోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన పాపిరెడ్డి హ‌త్య కేసులో ప‌దిమంది నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన తాడిప‌ర్తి పాపిరెడ్డిని ఈ నెల 17న వైసీపీకి చెందిన కొంద‌రు వ్య‌క్తులు క‌త్తులు, రాడ్ల‌తో తీవ్ర‌గా గాయ‌ప‌ర‌చ‌డంతో ఆయ‌న మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న పూర్వాప‌రాలు ఇలా ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల టైంలో కండ్ల‌కుంట గ్రామం రెండు […]

టీఆర్ ఎస్‌లో స‌ర్వే మంట‌లు.. ప్ర‌జాద‌ర‌ణ కోల్పోతున్న నేత‌లు

2014లో ఓ ప్ర‌భంజ‌నం మాదిరిగా తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ పార్టీకి ముచ్చ‌ట‌గా మూడేళ్లు పూర్త‌య్యాయి. మ‌రో రెండేళ్ల‌లో 2019 ఎన్నిక‌లు త‌రుముకొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు కేసీఆర్ ఇప్ప‌టి నుంచే త‌న సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల్లో అధికార పార్టీకి, నేత‌ల‌కు ఉన్న బ‌లాబ‌లాల‌ను, అభిప్రాయాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ నేప‌థ్యంలో నే ఇటీవ‌ల నేత‌ల ప‌నితీరు ఆధారంగా స‌ర్వే చేయించారు. గ‌తంలోనూ ఒకసారి ఈ […]

బాలయ్య చూపు ఆ జిల్లా పైనా!

దివంగత ఎన్టీరామారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోట‌. టీడీపీ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఇక్క‌డ ఆ పార్టీ ఓడిపోలేదు. 2014 ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్టీఆర్ వార‌సుడు బాల‌య్య ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. బాల‌య్య ఇక్క‌డ ఎమ్మెల్యేగా గెలిచినా గ‌తంలో త‌న తండ్రికి వ‌చ్చిన మెజార్టీ మాత్రం బాల‌య్య‌కు రాలేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రెండేళ్ల‌లో బాల‌య్య బాగానే అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. […]

ఏపీలో ఎమ్మెల్యే సీట్ల పెంపుపై వైసీపీ యాంటీ ప్ర‌చారం

రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. ఏపీ, తెలంగాణ‌లో అసెంబ్లీ స్థానాల‌ను పెంచాల్సి ఉంటుంది. అంటే ప్ర‌స్తుతం ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌నే పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించి సంఖ్య‌ను పెంచ‌డం ద్వారా స‌భ‌ల‌ను బ‌లోపేతం చేయాలి. దీనిపై ఇటు ఏపీ సీఎం చంద్ర‌బాబు, అటు తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రీ ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీ కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే, ఇక్క‌డ ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంటోంది. ఏపీలో ఏకైక బ‌ల‌మైన విప‌క్షంగా ఉన్న […]

పశ్చిమగోదావరి టీడీపీ ఎమ్మెల్యేల గెలుపు ఓటముల పరిస్థితి

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పేరు చెపితే టీడీపీకి స్ట్రాంగ్ కంచుకోట అన్న విష‌యం ప్ర‌తి ఒక్క‌రి మ‌దిలో మెదులుతుంది. అస‌లు ఈ రోజు చంద్ర‌బాబు సీఎం పీఠం మీద ఉన్నారంటూ అందుకే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లానే కార‌ణం. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని 15 ఎమ్మెల్యే సీట్ల‌తో పాటు 3 ఎంపీ స్థానాలు టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి జ‌రిగిన చాలా ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీకి అంత కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లాలో […]