ర‌క్ష‌ణ‌నిధి గ్రాఫ్ ఎలా ఉంది?ప‌్ల‌స్‌లు, మైన‌స్‌లు ఇవే

కృష్ణా జిల్లాలోని ప‌శ్చిమ‌ప్రాంతంలో వెన‌క‌ప‌డిన నియోజ‌క‌వ‌ర్గం తిరువూరు. ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం అయిన తిరువూరులో గ‌త మూడుసార్లు టీడీపీ గెల‌వ‌క‌పోవ‌డం ప్ర‌త్యేక‌త‌. గ‌త ఎన్నిక‌ల్లో పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ‌నిధి తిరువూరు నుంచి పోటీ చేసి 1676 ఓట్ల స్వ‌ల్ప మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. గ‌తంలో స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధిగా ప‌నిచేసిన ర‌క్ష‌ణ‌నిధి ఎమ్మెల్యేగా కొన్ని ప‌రిమితుల‌కు లోబ‌డ‌డం వ‌ల్ల అనుకున్న స్థాయిలో ప్రోగ్రెస్ చూపించ‌లేక‌పోతున్నారు. విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కావ‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో […]

షాక్‌: వైసీపీలోకి 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు…!

ఏపీలో అధికార టీడీపీ ఈ మూడేళ్ల‌లో రాజ‌కీయంగా సాధించింది ఏంటంటే అది ఒకే ఒక్క‌టి… విప‌క్ష వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చుకోవ‌డం. చంద్ర‌బాబు అభివృద్ధి ద్వారా బ‌లోపేతం అవ్వాల‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేసి ఇత‌ర పార్టీ ఎమ్మెల్యేల‌ను చేర్చుకుని పార్టీని బలోపేతం చేయాల‌నే ప్ర‌య‌త్నానికి తెర‌దీశారు. వైసీపీని రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టేందుకు చంద్ర‌బాబు వేసిన ఈ ఎత్తులు ఇప్పుడు బాబుకే పెద్ద ముప్పు కాబోతున్నాయి. ఏపీ టీడీపీలో ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న రాజ‌కీయ ప‌రిణామాలు […]

మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది..2019లో గెలుస్తాడా?

జిల్లా కేంద్ర‌మైన క‌ర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ.మోహ‌న్‌రెడ్డి ఫ‌స్ట్ టైం వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. మాజీ మంత్రి ఎస్వీ.సుబ్బారెడ్డి కుమారుడు అయిన మోహ‌న్‌రెడ్డి దివంగ‌త భూమా దంప‌తుల్లో శోభ‌కు స్వ‌యానా సోద‌రుడు కాగా, నాగిరెడ్డికి బావ‌మ‌రిది. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన మోహ‌న్‌రెడ్డి ఇప్ప‌ట‌కీ రాజ‌కీయంగాను పూర్తిగా గ్రిప్ సాధించ‌కపోవ‌డం ఓ మైన‌స్ అయితే, వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి మార‌డం మ‌రో మైన‌స్‌. ఇక అధికార పార్టీలోకి వ‌చ్చినా […]

ఉంగుటూరు ఎమ్మెల్యే గ‌న్నిది కొత్త రూటా..? పాత రూటా..?

ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా ప‌శ్చిమ‌గోదావ‌రి. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న వార్త‌లు ఇక్క‌డ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను టెన్ష‌న్ పెట్టిస్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాలు కొత్తగా మారితే ? తాము ఎక్క‌డ నుంచి పోటీ చేయాలి ? అన్న ప్ర‌శ్న ఇప్పుడు వీళ్ల‌కు పెద్ద సంక‌టంగా మారాయి. ఈ క్ర‌మంలోనే ఉంగుటూరు టీడీపీ ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు ? ఆయ‌న రూటు ఎలా ? ఉంటుంది ? […]

అఖిల మార‌క‌పోతే ఆళ్ల‌గ‌డ్డలో ఈ సారి క‌ష్ట‌మే

క‌ర్నూలు జిల్లాలో ఫ్యాక్ష‌న్ ప్ర‌భావం బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఈ నియోజ‌క‌వ‌ర్గం భూమా ఫ్యామిలీకి కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గం భూమా ఫ్యామిలీకి ఎంత బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఏంటంటే ఇక్క‌డ ఐదుసార్లు గెలిచిన దివంగ‌త భూమా నాగిరెడ్డి స‌తీమ‌ణి, దివంగ‌త శోభా నాగిరెడ్డి టీడీపీ – ప్ర‌జారాజ్యం – వైసీపీ ఇలా ఎన్ని పార్టీలు మారినా ఆమే గెలిచింది. ఇక్క‌డ పార్టీ ఇమేజ్ కంటే భూమా ఫ్యామిలీ ఇమేజే గ‌ట్టిగా ప‌నిచేసింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక […]

పీత‌ల ఈ గ్రూపు రాజ‌కీయాల‌తో లాభం ఏంటి…?

టీడీపీ కంచుకోట అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో అధికార పార్టీలో గ‌త మూడేళ్లుగా ఎంపీ వ‌ర్సెస్ మాజీ మంత్రి మ‌ధ్య జ‌రుగుతోన్న ఆధిప‌త్య పోరుతో పార్టీకి తీర‌ని న‌ష్టం జ‌రుగుతోంది. ఈ పోరులో త‌ప్పొప్పుల విష‌యంలో ఎవ‌రి వాద‌న‌లు వారు త‌మ‌కు అనుకూలంగా వినిపించుకోవ‌డం కామ‌న్‌. వాస్త‌వంగా చూస్తే ఎక్క‌డో డెల్టాకు చెందిన పీత‌ల సుజాత‌ను గ‌త ఎన్నిక‌ల్లో చింత‌ల‌పూడికి ఆహ్వానించారు. చింత‌ల‌పూడిలో ఆమెను టీడీపీ కార్య‌క‌ర్త‌లు క‌ష్ట‌ప‌డి గెలిపించుకున్నారు. ఎస్సీ లేడీ కోటాలో ఆమెకు గెలిచిన వెంట‌నే […]

కృష్ణా జిల్లాకు న‌లుగురు కొత్త ఎమ్మెల్యేలు

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశం స్పీడ్ అందుకుంద‌ని వార్త‌లు రావ‌డంతో ఏపీలో వివిధ పార్టీల ఆశావాహుల్లో ఎక్కడా లేని ఫుల్ జోష్ క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఇప్పుడు 225 కానున్నాయి. ఈ లెక్క‌న చూస్తే ఒక్కో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం పరిధిలో ప్రస్తుతం ఉన్న 7 ఎమ్మెల్యే సీట్లు ఇప్పుడు 9 కానున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ రాజ‌ధాని కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో సైతం నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో నాలుగు కొత్త అసెంబ్లీ […]

మైల‌వ‌రంలో ఉమాకు యాంటీ…నియోజ‌క‌వ‌ర్గం మార్పుపై మాస్టర్ ప్లాన్‌

ఏపీ ఇరిగేష‌న్ మినిస్ట‌ర్ దేవినేని ఉమా పేరు రాష్ట్ర‌వ్యాప్తంగా మార్మోగుతున్నా ఆయ‌న ప్రాథినిత్యం వ‌హిస్తోన్న మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం మ‌స‌క‌బారుతున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఉమా అంటే ఏపీ స్టేట్ వైజ్‌గాను, కృష్ణా జిల్లాలోను ఓ పొలిటిక‌ల్ ఐకాన్ అన్న టాక్ ఉంది. అయితే ఈ క్రేజ్ ఎలా ఉన్నా ఉమా ఇప్పుడు మైల‌వ‌రంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. 1999, 2004లో నందిగామ నుంచి గెలిచిన ఉమా 2009, 2014లో మైల‌వ‌రం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి […]

ఒకే జిల్లాలో ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి..!

ఈ హెడ్డింగే చాలా షాకింగ్‌గా ఉన్న‌ట్టు క‌నిపిస్తోందా ? ఒకే జిల్లా నుంచి ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ చేయ‌డ‌మా ? ఇది నిజ‌మేనా ? అన్న అనుమానాలు చాలా మందిలో రేకెత్తుతాయి. అయితే ఆ జిల్లాలో జ‌రుగుతోన్న రాజ‌కీయ ప‌రిణామాలు మాత్రం అధికార పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నార‌న్న సంకేతాలే ఇస్తున్నాయి. ఆ జిల్లా రాజ‌ధాని కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లా కాగా….ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఒకరు మాజీ మంత్రి, ప్ర‌త్తిపాడు […]