రష్మిక మందన్నా.. పరిచయాలు అవసరం లేని పేరు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు కన్నడలోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఈ లక్కీ బ్యూటీ మారిపోయింది. ఇక త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రష్మికకు.. తమిళంలో మాత్రం అనుకోని దెబ్బ తగిలింది. ఇటీవల కార్తి హీరోగా తెరకెక్కిన `సుల్తాన్` సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది రష్మిక. భాగ్యరాజా ఖన్నన్ దర్శకత్వం వహించిన ఈ […]
Tag: Latest news
త్రివిక్రమ్ వర్సెస్ కొరటాల..ఎన్టీఆర్ ఓటు ఎవరికో?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమా ఏ డైరెక్టర్తో చేస్తాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. గత కొంత కాలంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ.. కొరటాల శివ పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాలతోనే చేస్తాడని వార్తలు […]
‘వకీల్ సాబ్’ కొంపముంచిన ఐపీఎల్..ఏం జరిగిందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత `వకీల్ సాబ్` చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలీవుడ్లో హిట్ అయిన `పింక్`కు రీమేక్. దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలై సూపర్ టాక్తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం దుమ్ము దులిపేస్తోంది. ఇదిలా ఉంటే.. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు ఇలా ఏదో […]
వివాదాల్లో చిక్కుకున్న జో బైడెన్ కుమారుడు..!?
అమెరికా అధ్యక్షుడు అయిన జో బైడెన్ కొడుకు హంటర్ బిడెన్ పలు వివాదాల్లో పడ్డాడు. లక్షలాది డాలర్లు దుబారాగా హంటర్ ఖర్చు చేసినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. కాల్గర్ల్స్, డ్రగ్స్, లగ్జరీ వాహనాల పై తాను ఖర్చు చేయడం వీటిలో ఉన్నాయి. హంటర్ ల్యాప్టాప్ నుంచి వచ్చిన సమాచారం ద్వారా ఈ సంగతులు వెలుగులోకి వచ్చాయి. హంటర్ బిడెన్ కు డైలీ మెయిల్కు 103,000 టెక్స్ట్ సందేశాలు, 1.54 లక్షల ఈ-మెయిల్స్, హంటర్ ల్యాప్టాప్ల నుంచి 2 […]
వ్యాక్సిన్ వెయించుకుంటే బిర్యానీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ..ఎక్కడంటే?
ప్రస్తతం దేశంలో కరోనా వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి దాకా వేలల్లో నమోదైన కరోనా కేసులు.. ఇప్పుడు లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఈ మహమ్మారిని జయించాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు టీకా ఉత్సవం దేశ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. అయితే ప్రజల్లో పలు అపోహలు ఉండడంతో.. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలను వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ […]
ధోనీకి షాక్.. 12 లక్షల జరిమానా ఎందుకంటే…!?
ఐపీఎల్ 14వ సీజన్ మొదటి మ్యాచ్ లోనే ఓటమి పాలయింది చెన్నై సూపర్ కింగ్స్. ఇదే కాకుండా ఆ టీమ్ కెప్టెన్ అయిన ధోనీకి ఏకంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఎమ్మెస్ ధోనీకి ఈ జరిమానా విధించారు. దీనిని తన మొదటి నేరంగా పరిగణించి జరిమానాతో వదిలి పెట్టారు. ఈ మ్యాచ్లో ధోనీ డకౌటైన సంగతి అందరికి తెలిసిందే. 2015 తర్వాత చెన్నై టీమ్ […]
మహేష్ నో చెప్పిన ఆ సినిమాకు సోనూసూద్ గ్రీన్సిగ్నెల్?
అధికారికంగా ప్రకటించి కూడా పట్టాలెక్కని సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన` ఒకటి. మొదట ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని పూరీ భావించారు. అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశాడు. కానీ, వీరిద్దరి మధ్య విభేదాలు తొంగి చూడటంతో.. మహేష్ ఈ సినిమా చేసేందుకు నో చెప్పాడు. దీంతో ఈ సినిమా మరుగున మడిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, పూరీ మాత్రం ఇటీవలె ‘జగనణమన […]
`ఆర్ఆర్ఆర్` నుంచి మరో అదిరిపోయే అప్డేట్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. […]
భారత్లో కరోనా వీర విజృంభణ..లక్షన్నరకు పైగా కొత్త కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్లో 1,52,879 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,33,58,805 కు చేరుకుంది. అలాగే నిన్న 839 మంది […]