కరోనా వైరస్ మానవ సంబంధాలను మంటగలుపుతున్నది. కుటుంబ అనుబంధాలను సైతం చిధ్రం చేస్తున్నది. అప్యాయత పంచాల్సిన వారే అనుమానంతో పరాయివాళ్లుగా మారేలా చేస్తున్నది. అందరూ ఉన్నా అనాథాలుగా మారాల్సిన దుస్థితికి తీసుకొస్తున్నది. వైరస్ బారిన పడిన తల్లిదండ్రులను, పిల్లలను కొందరు ప్రాణాలకు తెగించి కాపాడుకుంటుంటే, మరికొందరు మాత్రం బతుకుతీపితో అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు నిదర్శనంగా నిలుస్తుంది కృష్ణజిల్లాలో వెలుగుచూసిన ఈ సంఘటన. కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ తండ్రి అంత్యక్రియలను నిర్వహించకుండా వెళ్లిపోయాడు ఓ దుర్మార్గ కొడుకు. వివరాల్లోకి […]
Tag: Corona
ఆ తేదీవరకూ కరోనా తీవ్రత.. విశాఖ శారదాపీఠం
కొవిడ్ సెకండ్ వేవ్ సుడిగాలిలా విజృంభిస్తున్నది. మహమ్మారి పంజాకు వేలాది మంది ప్రాణాలను కోల్పోతుండగా, లక్షలాదిమంది గజగజ వణుకుతున్నారు. ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి కరోనా ఎప్పటి వరకు ఉంటుందనే విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది ఉగాది రోజున(ఏప్రిల్ 13వ తేదీన) పంచాంగ విశ్లేషణ సందర్భంగా కరోనా తీవ్రత గురించి ప్రస్తావించారు. కరోనా తీవ్రత ఎలా ఉండబోతుందన్న […]
కోవిడ్ ను ఎదుర్కోనేందకు కేంద్రం కొత్త కార్యక్రమం
దేశంలో కోవిడ్-19 సంక్రమణ సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో భాగంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిరూపిత ఆయుర్వేద మూలికా ఔషధం ఆయుష్64, సిద్ధ ఔషధం కబసురా కుడినీర్లను పంపిణీ చేయడానికి దేశవ్యాప్తంగా భారీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆసుపత్రుల్లో లేని కోవిడ్ రోగులకు వాటిని అందివ్వనున్నారు. ఆ రెండు మందులు సమర్థవంతంగా పనిచేస్తాయని మల్టీ-సెంటర్ క్లినికల్ ట్రయల్స్ లో రుజువయింది కూడా. ఆయూష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ సంస్థల నెట్వర్క్ను ఉపయోగించుకుని, దశలవారీగా పంపిణీకి సమగ్ర […]
కరోనా సాకుతో పెళ్లికి నిరాకరణ..! తీరా కట్ చేస్తే..
ఇప్పుడు దేనికైనా కరోనా మహమ్మారిని అడ్డుగా పెట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా వెలుగుచూసిన సంఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. మరికొద్ది క్షణాల్లో జరగాల్సిన పెళ్లి ఆగడమే కాకుండా అది ఠాణాకు చేరుకుంది. తీరా అధికారులు విచారించగా ఒక్కో విషయం బయటపడుతున్నది. వివరాల్లోకి వెళ్లితే.. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఓ అబ్బాయి ముదిగుబ్బ కు చెందిన ఓ అమ్మాయితో వివాహం జరిపించేందుకు పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. అనుకున్న ప్రకారం వధూవరులు కదిరికి చేరుకోగా పెళ్లి తంతు కొనసాగిస్తున్నారు […]
కరోనాతో భార్య.. బ్లేడ్తో కోసి హతమార్చిన భర్త
కరోనా సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ఒకవైపు ఊపిరి సలపనివ్వకుండా ప్రాణాలను తీస్తుండగా, మరోవైపు మరెన్నో దారుణ సంఘటనలకు కారణమవుతున్నది. కుటుంబ బంధాలను చిద్రం చేస్తున్నది. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంఘటన. కరోనా బారిన పడిన భార్యను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా కావలి పట్టణం సంక్లవారి తోట పరిధిలోని గోరింకపాలెం వీధికి చెందిన మల్యాద్రి, […]
జూ పార్క్ లో కరోనా కలకలం..?
కరోనా వైరస్ రెండోవేవ్ రోజు రోజుకు తీవ్ర రొఊపం దాలుస్తుంది. రోజు రోజుకు మనషుల్లోనే కాకుండా ఇప్పుడు ఈ ప్రాణాంతకమయిన కరోనా వైరస్ తాజాగా జంతువులో కూడా వ్యాపించింది. అమెరికాలో కరో్నా మొదటి దశలో ఉన్నప్పుడు మొదటిసారిగా ఓ పులికి సోకినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ కరోనా మహమ్మరి మొదటి సారిగా ఏకంగా 8 సింహాలకు సోకింది. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఈ ఘటన నమోదు అయింది. అసలు వివరాల్లోకి వెళ్తే, […]
ప్రేమికుడికి పోలీసుల హార్ట్ టచ్ రిప్లయ్.. నెటిజన్లు ఫిదా
కరోనా మహమ్మారి ఒకవైపు ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నది. అదేవిధంగా ప్రేమకులకు తీరని కష్టాలను తెచ్చిపెడుతుంది. కలుసుకోలేని పరిస్థితి కల్పించింది. ఒకరినొకరు చూసుకోలేకపోతున్నారు. ఈ ఎడబాటును తట్టుకోలేక అనేక మంది వేదనతో నలిగిపోతున్నారు. అలాంటి విరహవేదనతో నలిగిపోతున్న ఓ ప్రేమికుడు నేరుగా పోలీసులనే ఆశ్రయించాడు. సదరు ప్రేమికుడి బాధను అర్థం చేసుకోవడంతో పాటు, అతని మెసేజ్కు పోలీసులు హర్ట్ టచ్ రిప్లయ్ ఇచ్చారు. దీనికి నెటిజన్లు ఫిదా అవడంతో పాటు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబయి […]
ఎవరెస్ట్ శిఖరంపైనా కరోనా..!
కరోనా మహమ్మారి ఇటు కన్యాకుమారి నుంచి అటు అసేతు హిమాచలం వరకూ విస్తరించింది. పట్టణాలను, పల్లెలను గడగడలాడిస్తున్న వైరస్ ఇప్పుడు ఏకంగా అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ పైకి కూడా పాకేసింది. కొవిడ్ 19 వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన ఓ వ్యక్తిని ఎవరెస్ట్ బేస్ క్యాంపులో అధికారులు గుర్తించారు. సదరు వ్యక్తిని వెంటనే హెలికాఫ్టర్ ద్వారా ఖాట్మండులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇదిలా ఉండగా పర్వతారోహకుల్లో సాధారణంగా `పల్మనరీ ఎడీమా`, […]
కరోనా ఉధృతి.. బ్యాంకుల కీలక నిర్ణయం..
కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలను మహమ్మారి పట్టి పీడిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువవడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ప్యూ పెట్టిన విషయం తెల్సిందే. రైలు, బస్సు వేళలను కూడా మార్చారు. అన్ని రంగాలు కూడా తమ పనివేళలను కుదించుకున్నాయి. అందుల భాగంగా తాజాగా బ్యాంకింగ్ రంగంలోనూ పనివేళలు కుదిస్తున్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది. కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం […]