వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. ఇటీవల నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి.. వైసీపీని నామ రూపాలు లేకుండా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీకి ప్రధాన వెన్నెముకగా ఉన్న జగన్ను తప్పిస్తే.. ఇక, వైసీపీ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషించనుంది. ఎందుకంటే.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చెప్పినా.. […]
Tag: chandrababu naidu
అటూ ఇటూ కాకుండా పోయిన టీడీపీ నేత.. టిక్కెట్ లేనట్టే..?
రాజకీయాల్లో సరైన టైంలో సరైన నిర్ణయం ముఖ్యం. ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు చేసిన సీనియర్ నేత అయినా కూడా ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే చాలు.. పాతాళంలోకి వెళ్లిపోతారు. ఇప్పుడు కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ సతీష్రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. పులివెందులలో వైఎస్ ఫ్యామిలీని ఢీ కొట్టి పార్టీని నిలబెట్టిన చరిత్ర సతీష్రెడ్డిదే. గతంలో దివంగత వైఎస్సార్పై రెండు సార్లు, ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ […]
బాబు చేయలేనిది..జగన్ చేసి చూపించారు..!
అధికారం ఉండగానే కాదు.. దానిని ఎలా వినియోగించుకోవాలో.. రాష్ట్రానికి ఎలా మేళ్లు చేయాలో కూడా తెలియాలి. ఇది ఇప్పుడు సీఎం జగన్ చేసి చూపించారని అంటున్నారు పరిశీలకులు. నేను 14 సంవత్స రాలు.. రాష్ట్రాన్ని పాలించానని చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్రబాబు చేయలేనివి చాలానే ఉన్నాయి. అంతెందుకు.. తెలుగు సినిమా పరిశ్రమకు తాను అనేకం చేశానని.. హైదరాబాద్లో స్టూడియోలకు అనుమతులు ఇచ్చానని పదే పదే చెప్పుకొనే.. చంద్రబాబు విబజన తర్వాత.. సినిమా పరిశ్రమను ఏపీకి తీసుకురాలేకపోయారు. రాజధాని […]
బాబుకు ఘోర అవమానం.. హైదరాబాద్లోనే ఉన్నా ఇలా జరిగిందే..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘోర అవమానం జరిగిందా? ఆయన ఊహించని విధంగా ఆయనను పక్కన పెట్టారా? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ నాయకులు. ఇదే విషయం పార్టీలో గుసగుసగా మారడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్లో చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో రామానుజాచార్యుల విగ్రహం ప్రతిష్ట.. 108 దేశాల పేరుతో ఆలయాల నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రం నుంచి ప్రధాని నరేంద్రమోడీ వచ్చారు. అదేవిధంగా.. రాష్ట్రపతి రామ్నాథ్ కూడా ఈ నెల 14న […]
టీడీపీలో ఈ నేతలు పెద్ద ఫ్లవర్స్ అయిపోయారా…!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఇప్పటికిప్పుడు కావాల్సింది.. చురుకుదనం.. వేడి.. చొరవ.. ఢీ అంటే.. ఢీ అనే నేతలు… ప్రజల్లోకి చొచ్చుకుపోయే నాయకులు! అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు ఎంత మందిలో ఈ లక్షణాలు ఉన్నాయి.? ఎంత మంది పార్టీ లో దూకుడుగా ఉన్నారు? అనే విషయం ఆసక్తిగా మారింది. మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత చంద్రబాబు శపథం నెరవేర్చాలనే సంకల్పం ఉంది. అయినప్పటికీ..కొందరు మాత్రం.. చురుగ్గా వ్యవహరించడం లేదనే టాక్ వినిపిస్తోంది. […]
ముందస్తు లేదని ఇన్నిసార్లు చెబుతున్నారెందుకు?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదు. రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సజ్జల చెబితే ఇక సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టే. నిజానికి ప్రభుత్వంలోని చాలా మంది పెద్దలు కొన్ని రోజులుగా ముందస్తు లేదు.. ముందస్తులేదు అని పదేపదే చెబుతున్నారు. ఆ రకంగా ప్రజలకు ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందనే నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా సజ్జల కూడా చెప్పేశారు. దీనితో ఫైనల్ అథారిటీ కూడా చెప్పేసినట్టే. […]
వంశీ సారీతో టీడీపీలో షాక్
ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సీన్ ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. అది గౌరవసభ కాదు.. కౌరవ సభ.. నా భార్యను అవమానించారు అంటూ చంద్రబాబు నాయుడు రోదించారు. నేను ఆ సభకు వెళ్లను.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా అని శపథం చేసి వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే వంశీ తదితరులు తన కుటుంబంపై, తన భార్యపై అవమానకరంగా మాట్లాడారు అని బాబు ఆరోపించారు. ఆ రెండు రోజులు […]
నాడొక మాట.. నేడొక మాట.. దటీజ్ బాబు
40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఎందుకో ప్రజల విశ్వాసం పొందలేకపోయాడు. ఎన్నికల్లో గెలిచాడు.. సీఎంగా చేశాడు అనే విషయాలు పక్కన పెడితే అప్పట్లో ప్రత్యామ్నాయం ప్రజలకు లేకపోయింది కాబట్టి సీఎం సీటులో కూర్చున్నాడు. అంతే.. ఆయనకేం పెద్ద ఫాలోయింగ్ లేదు..కనుసైగ చేస్తే కదలి వచ్చే కార్యకర్తలు లేరు.. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక మాట మీద ఉండడు.. ఒకరిని నమ్మడు.. అందుకే ఆయన పరిస్థితి ఇపుడలా తయారైంది. ఈ మాజీ సీఎం శనివారం (ఈరోజు) […]
చంద్రబాబుకు నిద్రలేని రాత్రులు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇపుడు రాజకీయంగా గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడనే చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి జగన్ కు సీఎం పీఠం అప్పగించిన చంద్రబాబు .. ఆ తరువాత రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ తమ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాలను వైసీపీకి కోల్పోయాడు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీదే హవా అయింది. సరే.. వారు అధికారంలోఉన్నారు.. కాబట్టి వైసీపీదే పైచేయి అవుతుందని అనుకోవచ్చు. మరి టీడీపీ కంచుకోటలు వైసీపీ దెబ్బకు బద్దలవుతున్నాయంటే టీడీపీ […]