ఏపీలో కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు 225కు పెరగనున్నాయి. ఓ వైపు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, ముందస్తు ఎన్నికల వార్తలతో ఏపీలో పొలిటికల్ వాతావరణం అప్పుడే హీటెక్కుతోంది. ఈ క్రమంలోనే కొత్తగా ఎక్కడ నియోజకవర్గాలు పెరుగుతాయి ..? ఎవరెవరు రేసులో ఉన్నారన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలోనే ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా ఏర్పడే కొత్త నియోజకవర్గంపై అధికార టీడీపీలోనే ఇద్దరు రాజకీయ వారసులు కన్నేసినట్టు గుంటూరు జిల్లా రాజకీయాల్లో […]
Tag: AP
కేసీఆర్ `తెలుగు` సెంటిమెంట్ వెనుక వ్యూహమిదే
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏం మాట్లాడినా దాని వెనుక అర్థం, పరమార్థం ఉంటాయనేది విశ్లేషకులకే కాదు కనీస రాజకీయ అవగాహన ఉన్న వారికి కూడా సులువుగా అర్థమవుతుంది. ఎప్పుడూ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకునే ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటారు! ఇప్పుడు అలాంటి నిర్ణయంతో ఏపీలో పాగా వేయాలని చూస్తున్నారు. టీఆర్ఎస్ను.. ఏపీలోనూ విస్తరించేందుకు పక్కా ప్లాన్తో సిద్ధమవుతున్నారు. ప్రాంతీయ పార్టీల హవా నడిస్తున్న సమయంలో.. వేరే రాష్ట్రానికి చెందిన పార్టీ.. అందులోనూ […]
టీడీపీ వాళ్లనే టార్గెట్ చేస్తోన్న ఏపీ మంత్రి
పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ, టీడీపీ మధ్య ఆంతర్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకి, మున్సిపల్ చైర్మన్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రతి వ్యవహారంలోనూ టీడీపీ, బీజేపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా కలహాలు ముదిరిపోయాయి! ప్రతి విషయంలోనూ మంత్రి టీడీపీ నాయకులను టార్గెట్ చేయడాన్ని టీడీపీ శ్రేణులు సహించలేకపోతున్నాయి. మిత్ర పక్షమయినా.. విపక్షంలా వ్యవహరిస్తున్నారిన మండిపడుతున్నాయి. ఇదే పద్ధతి కొనసాగితే గత ఎన్నికల్లో గెలిపించిన తామే వచ్చే ఎన్నికల్లో […]
నాలుగు కొత్త నియోజవర్గాలు … నలుగురు కొత్త ఎమ్మెల్యేలు
ఏపీలో పశ్చిమగోదావరి పేరు చెప్పగానే సంచలన రాజకీయాలకు కేంద్రబిందువుగా నిలుస్తుంది. గత ఎన్నికల్లో జిల్లాలోని అన్ని సీట్లలో టీడీపీ క్లీన్స్వీప్ చేసేసింది. జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లు (తాడేపల్లిగూడెంలో మిత్రపక్షం బీజేపీ)తో కలుపుకుని మూడు ఎంపీ స్థానాలు టీడీపీకే దక్కాయి. రాజకీయంగా జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతంగా ఉంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో నాలుగు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయన్న అంచనాలతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తోన్న ఆశావాహులు లిస్టు రోజు రోజుకు […]
పొలిటికల్ ఫ్యూచర్ కోసం వైసీపీని ఆశ్రయించిన ఆ మాజీ మంత్రి..!
ముందస్తు ఎన్నికలతో ఏపీలో రాజకీయం రంజుగా మారుతోంది. ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలోకి వెళ్లిపోవాలని ఇప్పటి నుంచే ప్లాన్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కప్పదాట్లు, కప్పుల తక్కెడలు, జంపింగ్ జపాంగ్ల లిస్టులు రోజు రోజుకు పెరిగిపోనున్నాయి. ఈ క్రమంలోనే ఓ మాజీ మంత్రి సైతం తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం వైసీపీలోకి జంప్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు రూమర్లు వస్తున్నాయి. విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గానికి […]
అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యే..సన్నిహితులతో చర్చలు
టీడీపీలో ఓ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే ఆ పార్టీలో వేగలేకపోతున్నారా ? సదరు నేత చూపులు వైసీపీ వైపు ఉన్నాయా ? అంటే అవుననే అంటున్నారు ఏపీలోని రాజకీయ విశ్లేషకులు. గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి 2009లో నరసారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు అప్పటి గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావడంతో మోదుగులకు చంద్రబాబు గుంటూరు వెస్ట్ సీటు కేటాయించారు. […]
ఇద్దరు చంద్రులకు మోదీ మళ్లీ షాక్?
సంచలన నిర్ణయాలతో దేశ గతినే మార్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాని మోదీ! ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. కానీ వాటిని కనిపించకుండా చేస్తున్నారు ఇద్దరు చంద్రులు! ఇప్పుడు వీరికి మరో పిడుగులాంటి వార్త! రాజకీయంగా పార్టీల అస్థిత్వంపై దెబ్బకొట్టే నిర్ణయాన్ని మోదీ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులను బుజ్జగించేందుకు ఇప్పటివరకూ ప్రభుత్వాలు ఎమ్మెల్సీ ద్వారా కొందరిని మండలికి పంపుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దుచేయాలని మోదీ నిర్ణయించుకున్నారట. అంతేగాక దీనిపై […]
ఆ విషయంలో చంద్రబాబు లెక్క తప్పిందా?
బహిరంగ సభల్లో ప్రజలతో మాట్లాడించడం.. వారిని ప్రశ్నలు అడగటం చేస్తూ ఉంటారు సీఎం చంద్రబాబు! వారు టీడీపీ పథకాల గురించి, తన గురించి ఏం చెబుతారోనని తెలుసుకునేందుకు ఇలాంటివన్నీ ప్రత్యేకంగా రూపొందిస్తుంటారు. ఇటీవల పశ్చిమగోదావరిలో నిర్వహించిన సభలోనూ ఇలాగే గ్రామస్తులతో మాట్లాడించిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజల్లో టీడీపీపై సంతృప్త స్థాయిని పెంచాలని, ఎప్పటికప్పుడు నేతలకు చెబుతూ ఉంటారు. 80 శాతం సంతృప్తిగా ఉన్నారని. మిగిలిన వారిని కూడా ఈ జాబితాలో చేర్చాలని చెబుతూ ఉంటారు. […]
ఆ నలుగురు టీడీపీ ఎంపీలకు ప్రజాసేవ నై…వ్యాపారాలే జై
టికెట్ ఇచ్చిన పార్టీకి, ఓట్లేసిన ప్రజలకు కొంతమంది తెలుగుదేశం ఎంపీలు శఠగోపం పెడుతున్నారు. పార్టీని, ప్రజలను పట్టించుకోకుండా కేవలం వ్యక్తిగత అజెండాతో వ్యవహరిస్తున్నారు. స్వతహాగా పారిశ్రామిక వేత్తలయిన వీరు.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కేవలం తమ పరిశ్రమల అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ వ్యాపారాలు, వ్యక్తిగత సమస్యలను పట్టించుకుని.. ప్రజలను, పార్టీని పూర్తిగా విస్మరించారని అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజలకు చేరువకాకపోవడంతో పాటు సొంత వ్యాపారాలు, సొంత ఎజెండాతో ముందుకు వెళుతుండ టంతో […]