ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై క్లారిటీ ఇచ్చిన ఏపీ మంత్రి

కేంద్రంలోను, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై గ‌త కొద్ది రోజులుగా ఒక్క‌టే వార్త‌లు వ‌స్తున్నాయి. మోడీ వేవ్ బాగుండ‌డంతో మోడీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఇక తెలంగాణ‌లో కేసీఆర్ స్పీడ్ చూస్తుంటే ఇప్పుడైనా ఎన్నిక‌ల‌కు వెళ్లిపోవాల‌న్నంత ఉత్సాహంతో కేసీఆర్ ఉన్నారు. ఏపీలో మాత్రం నంద్యాల ఫ‌లితం ముందు వ‌ర‌కు ముంద‌స్తుపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డ్డ సీఎం చంద్ర‌బాబు నంద్యాల‌లో టీడీపీ భారీ మెజార్టీతో గెల‌వ‌డంతో పాటు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోను వార్ టీడీపీకి […]

హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్‌గా సీబీఐ మాజీ జేడీ?

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి సంబంధించిన అక్ర‌మాస్తుల కేసును స‌మ‌ర్థంగా విచారించి సంచ‌ల‌నాల‌కు కేంద్రంగా మారిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పేరు మ‌రోసారి తెలుగురాష్ట్రాల్లో వినిపించ‌బోతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన హైద‌రాబాద్ క‌మిష‌నర్ మ‌హేంద‌ర్ రెడ్డితో భేటీ కావ‌డం వెనుక కార‌ణ‌మేంట‌నే దానిపై ఇప్పుడు తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రో ఐదేళ్ల‌లో స‌ర్వీస్ ముగించుకోబోతున్న ఆయ‌న‌.. హైద‌రాబాద్‌లో త‌న స‌ర్వీసు ముగించాల‌ని భావిస్తున్నార‌నే వార్త తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ నాయకుల్లో మ‌ళ్లీ […]

జగన్,పవన్ మధ్యలో డీజీపీ

ప్రత్యేక హోదా మరో సారి రాజకీయ రంగు పులుముకుంటోంది.తమిళుల జల్లికట్టు స్ఫూర్తి తో ఆంధ్ర యువత కూడా ఈ నెల 26 న విశాఖ ఆర్ .కే బీచ్ లో శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.పిలుపునివ్వడం వరకు బాగానే వున్నా దానికి అటు జన సేన ఇటు వైసీపీ పార్టీ లు మద్దతు పలకడం తో సమస్యలు మొదలయ్యాయి. ఆంధ్ర యువత స్వచ్ఛందంగా నిరసనకు పిలుపునివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం.అదీగాక ప్రజా స్వాత్మ్యం లో శాంతియుత నిరసన […]

నారాయణమూర్తి రెమ్యునరేషన్ అంతా..!

విప్ల‌వ చిత్రాల ద‌ర్శ‌క‌నిర్మాత‌గా పేరున్న ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి త‌న సినిమాల‌న్ని త‌న సొంత బ్యాన‌ర్‌లోనే త‌ప్ప బ‌య‌ట బ్యాన‌ర్లో చేయ‌డు. త‌న సినిమాల‌న్నింటికి తానే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం, అన్ని ప‌నులు తానే ద‌గ్గ‌ర నుంచి చేసుకోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. పూరి జ‌గ‌న్నాథ్ అంత‌టి స్టార్ డైరెక్ట‌రే టెంప‌ర్ సినిమాలో కీల‌క‌మైన రోల్ ఆఫ‌ర్ చేస్తే సారీ బ్ర‌ద‌ర్ అని చెప్పాడు. అలాంటి ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి చాలా రోజుల త‌ర్వాత బ‌య‌టి బ్యాన‌ర్‌లో ‘హెడ్ కానిస్టేబుల్ వెంట‌ట్రామ‌య్య‌’ సినిమ‌మాలో న‌టించాడు. ఈ […]

జేసీ బ్ర‌ద‌ర్స్‌కు మ‌రో బ్ర‌దర్స్ స‌వాల్‌

అనంత‌పురం పేరు చెప్ప‌గానే ముందుగా వినిపించే పేర్లు జేసీ బ్ర‌ద‌ర్స్‌! ఒకరు ఎంపీగా, మ‌రొక‌రు ఎమ్మెల్యేగా జిల్లా అంత‌టినీ త‌మ గుప్పెట్లో పెట్టుకుని తిరుగులేకుండా ఏలుతున్నారు. అధికార పార్టీ అండ‌తో త‌మ ఆధిప‌త్యానికి ఎదురులేకుండా చూసుకుంటున్నారు. మ‌రి అటువంటి వారిని సొంత జిల్లాలోనే ఢీకొట్టాలంటే ఎంత సాహ‌సం చేయాలి!! అలాంటి వారిని ఢీకొట్టి సంచ‌ల‌నం సృష్టించారు జ‌గదీశ్వ‌ర్ రెడ్డి సోద‌రులు! జేసీ సోద‌రుల‌తో సై అంటే సై అంటున్నారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి! అనంతపురం […]

వైకాపాలో మాజీ సీఎం మ‌న‌వ‌డు

ఏపీ పొలిటిక‌ల్ పార్టీల్లోకి నేత‌ల చేరిక‌లు కొన‌సాగుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌ర ఏళ్ల స‌మ‌యం ఉన్నా కూడా.. నేత‌లు ఇప్ప‌టి నుంచే త‌మ స్టేజ్‌ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా కాక‌లు తీరిన కాంగ్రెస్ యోధుడు, మాజీ సీఎం దివంగ‌త కాసు బ్ర‌హ్మానంద రెడ్డి మ‌న‌వ‌డు కాసు మ‌హేష్ రెడ్డి విప‌క్ష వైకాపా లోకి జంప్ చేశారు. ఈయ‌న తండ్రి, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌, మాజీ మంత్రి కూడా అయిన‌ కాసు వెంక‌ట కృష్ణారెడ్డి ఇప్ప‌టికీ […]

స‌ర్వే బాగున్నా టీడీపీలో కొత్త టెన్ష‌న్‌

ఏపీ అధికార పార్టీ టీడీపీ నేత‌ల్లో కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వ‌హించిన స‌ర్వే ఫ‌లితాలే వీరిలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు కార‌ణం అయ్యాయ‌ట‌! వాస్త‌వానికి తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలో టీడీపీ పాల‌న‌, చంద్ర‌బాబు నాయ‌క‌త్వం త‌దిత‌ర అంశాల్లో అన్నీ ప్ల‌స్సులో వ‌చ్చాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉద్య‌మం రేగిన కాపు సామాజిక వ‌ర్గంలోనూ టీడీపీకి సానుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని రిపోర్ట్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు స‌హా టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద […]

ప‌వ‌న్ ముందుకు మీడియా పంచాయితీ

ఇప్పుడు ఏపీలో ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా.. రివ్వున వెళ్లి.. జ‌న‌సేనాని గుమ్మం ముందు వాలిపోతున్నారు! మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించు మ‌హాప్ర‌భో అంటూ జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్‌కి త‌మ‌గోడు వెళ్ల‌బోసుకుంటున్నారు. అదేస‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వం త‌మ‌ను పెడుతున్న క‌ష్టాల‌ను కూడా ఎక‌ర‌వు పెడుతున్నారు. 2014లో జ‌న‌సేన పార్టీని పెట్టిన ప‌వ‌న్‌కి జ‌నాల్లో పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ఉంది. అప్ప‌టి ఎన్న‌క‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తిచ్చి గెలిపించిన ప‌వ‌న్ త‌ర్వాత దూరంగా ఉన్నారు. అయితే, ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి భూముల […]

ఏపీలో బాబుకు త‌ల‌నొప్పిగా మ‌రో కుల ఉద్య‌మం

ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజ‌మేనంటున్నారు ప‌శ్చిమ‌గోదావ‌రికి చెందిన టీడీపీ నేత‌లు. ఇప్ప‌టికే తూర్పుగోదావ‌రి జిల్లాకి చెందిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చేస్తున్న కాపు ఉద్య‌మంతోనే చంద్రాబాబుకు తిక్క‌పుడుతుంటే.. ప‌శ్చిమ గోదావ‌రి కి చెందిన మ‌రో నేత మాదిగ స‌భ నిర్వ‌హిస్తాన‌ని, త‌న త‌ఢాకా చూపుతాన‌ని బెదిరిస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఈ ఉద్య‌మానికి కులం క‌ల‌రింగ్ వ‌స్తే.. బాబు డోలాయ‌మానంలో ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. నిజానికి కుల ఉద్య‌మాల‌కు రాష్ట్రంలో కొత్త‌కాదు. అయినా.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఈ […]