బిగ్ బ్రేకింగ్: ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య(88) క‌న్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు శ‌నివారం ఉద‌యం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు హుఠాహుఠిన‌ బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మ‌ధ్య‌లోనే ఆయ‌న తుదు శ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణాన్ని వైద్యులు నిర్ధారించ‌డంతో.. రోశయ్య పార్ధీవదేహాన్ని తిరిగి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొని వచ్చారు. దీంతో ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు ఆయ‌న మృతిపై సంతాపం వ్య‌క్తం […]

ట్రైలర్‏కు ముందు `పుష్ప`రాజ్ టీజ్ అదిరిపోయిందిగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి పార్ట్‌ను `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. వ‌రుస అప్డేట్స్‌ను వ‌దులుతూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. […]

కత్రినా పెళ్లికి ఏడడుగులు..ఏడు నియమాలట..!!

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సహనటుడు విక్కీ కౌశల్ ని ప్రేమించి వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు వీరు పెళ్లి తర్వాత నివసించడానికి విరాట్ కోహ్లీ దంపతులు నివసిస్తున్న అత్యంత ఖరీదైన ఫ్లాట్ లో ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. అంతే కాదు ఈ ఇంటికోసం విక్కీ కౌశల్ సుమారుగా నెలకు ఎనిమిది లక్షల రూపాయలను రెంట్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అపార్ట్మెంట్లో తన ఇంటిని బుక్ చేసుకోవడానికి ఏకంగా […]

అఖండ సినిమా పై పబ్లిక్ రివ్యూ ఎలా ఉందంటే..?

నందమూరి బాలకృష్ణ మూడు వరుస ఫ్లాపుల సినిమాల తర్వాత.. విడుదలైన తాజా చిత్రం అఖండ. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1500 పైగా థియేటర్లలో ఈ రోజున విడుదలైంది. ఇక అద్భుతమైన టాక్ తో ఈ సినిమా నడుస్తోంది. అయితే ఇప్పుడు పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఒక అభిమాని థియేటర్ బయట అఖండ మూవీ చూశాను.. కాలరెగరేసి చెబుతున్నాను బ్లాక్ బస్టర్ గా నిలబడుతుందని తెలియజేశారు. మరొక అభిమాని ఫైట్లు మామూలుగా […]

`ఆర్ఆర్ఆర్‌`లో ఆ విష‌యాన్ని లీక్ చేసేసిన రామ్ చ‌ర‌ణ్‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన తాజాగా మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో ఈ మూవీని రూపొందించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో డివివి దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి […]

`సిరివెన్నెల` సీతారామశాస్త్రి క‌న్నుమూత‌..విషాదంలో టాలీవుడ్‌!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ సినీ గేయ ర‌చ‌యిత `సిరివెన్నెల` సీతారామశాస్త్రి(66) కొద్ది సేప‌టి క్రిత‌మే క‌న్నుమూశారు. గత నెల 24న న్యూమెనియాతో హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్ప‌ట‌ల్‌లో చేరిన ఆయ‌న‌.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కన్నుమూసిన మూడు రోజులకే సీతారామశాస్త్రి మృతి చెంద‌డం సినీ ప్ర‌ముఖుల‌ను తీవ్రంగా క‌ల‌చివేస్తోంది మ‌రోవైపు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ప్రార్థించిన అభిమానులు.. ఆయ‌న […]

నిర్ణయం పాతదే అయినా.. ఉన్నట్టుండి తెరపైకి..

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఎవరికీ అంతుపట్టవు.. అందులోని అంతరార్థమూ అర్థం కాదు.. అలా అని అడిగే ధైర్యం కూడా ఎవరూ చేయరు. కనీసం అడగాలనే ఆలోచన కూడా వారికి రాదు. అందుకు ఓ ఉదాహరణే.. రాజధాని మార్పు. మూడు రాజధానుల తీర్మానాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పి మళ్లీ వస్తామని అసెంబ్లీలో చెప్పేంతవరకు ఎమ్మెల్యేలకే తెలియదు. అంతెందుకు మంత్రి వర్గ సమావేశంలో జగన్ తన సహచరులకు వివరించేంతవరకు వారికి కూడా తెలియదు. విధానపరమైన నిర్ణయాలను […]

8 ఏళ్ల పాటు బెడ్‌పైనే.. బాల్యంలో న‌ర‌కం చూసిన శివ శంకర్ మాస్టర్!

ప్ర‌ముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న్ను రక్షించుకునేందుకు కుటుంబ సభ్యులతో పాటు ప‌లువురు సినీ సెలబ్రిటీలు సైతం ఎంతగానో కృషి చేసినా ఫ‌లితం లేక‌పోయింది. ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే శివశంకర్‌ మాస్టర్‌ తుది శ్వాస విడిచారు. అందరితోనూ సఖ్యతతో మెలిగే శివశంకర్ మాస్టర్ మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇదిలా ఉంటే..తమిళనాడులోని చెన్నై లో 1948 డిసెంబరు 7వ […]

కొంప ముంచిన మంచు.. ట్రక్కును ఢీకొని 18 మంది దుర్మరణం..!

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదియా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర 24 పరగణాల జిల్లా బాగ్డా నుంచి 20 మంది వ్యక్తులు మెటాడోర్ వాహనంలో మృతదేహాలను తీసుకుని నవదీప్ శ్మశాన వాటిక వైపు బయలుదేరారు. వేగంగా వెళ్తున్న ఈ వాహనం నదియా జిల్లాలోని హన్సకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుల్బరి వద్ద రోడ్డు పక్కన ఆగి […]