అయితే…ఓకే:అయినా అనుమానమే!

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత ఎన్నికల కమిషనర్ నజీమ్ జైదీ స్పష్టం చేశారు. అయితే ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు తీసుకురావాలని, అదే విధంగా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని పాదుకొల్పాలని స్పష్టం చేశారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని న్యాయ మంత్రిత్వ శాఖకు తాము సిఫార్సు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే భారత్ వంటి దేశంలో ఈ స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలంటే […]

పట్టిసీమ పరవళ్లు భళా

గోదావరి నది వరద నీరు కృష్ణా నదిలో పరవ ళ్లు తొక్కనుంది. లక్షా 50 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం గోదావరి నదికి వస్తుండటంతో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా పంపింగ్ ప్రారంభిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ ప్రకటన చేయడంతో కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల కానుంది. .కృష్ణా పశ్చిమ డెల్టాకు నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ ఆధారంగా జూలై 16న సాగునీరు విడుదల చేయడం కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా […]

ఐటీ జాబా:జర భద్రం బ్రదర్!

వచ్చే ఐదు సంవత్సరాల వ్యవధిలో భారత ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న 6.4 లక్షల మంది తమ ఉద్యోగాలను పోగొట్టుగోనున్నారని యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న రీసెర్చ్ సంస్థ హెచ్ఎఫ్ఎస్ అంచనా వేస్తోంది. ఐటీ నిపుణుల్లో నైపుణ్యత తగ్గుతుండటం, యాంత్రీకరణ పెరగడమే ఇందుకు కారణమని, పనితీరు మెరుగుపరచుకోకుంటే, ఉద్యోగాలు ఊడిపోతాయని హెచ్చరించింది. 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 9 శాతం మంది, అంటే సుమారు 14 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతారని, భారత్ […]

బాబూ సిగ్గు సిగ్గు:ఆఖరికి అదికూడా కాపీ నా!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై తెలంగాణ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లను ఏపి ప్రభుత్వం కాపీ చేసిందని తెలంగాణ ఉన్నతా ధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాపీరైట్స్‌ చట్టం సెక్షన్‌ 63 ప్రకారం హైదరాబాద్‌లోని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్‌ కోర్టు అప్లికేషన్‌ సమాచారం కూడా కాపీకి గురైందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ తెలిపారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం […]

ముద్రగడ మౌనం అందుకేనా?

ముద్రగడ రెంటికీ చెడ్డ రేవడి నిరాహార దీక్ష ఎపిసోడ్‌ తర్వాత ముద్రగడ పద్మనాభంను ఎవరూ పట్టించుకోవడంలేదట. ఆయన్ను కొందరు నేతలు కలుస్తున్నప్పటికీ ఆ విషయాలకు మీడియాలో తగిన ప్రాధాన్యత దక్కడంలేదు. కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంసాలపై కేసులు నమోదవడంతో కాపు ఉద్యమ నాయకులు కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. టిడిపితో సర్దుకుపోతే కాపు సామాజిక వర్గం రిజర్వేషన్లు, ఇతర సహాయాల్ని పొందగలుగుతుందని లేని పక్షంలో వివాదాలు ముదిరి కాపు ఉద్యమం పక్కదారి పడుతుందనే ఆలోచన […]

చంద్రబాబుకి షాకిచ్చిన నరేంద్రమోడీ

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీకి ఇంకో అవకాశం ఇవ్వకపోవడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చంద్రబాబుకి పెద్ద ఝలక్‌ ఇచ్చారని చర్చించుకుంటున్నారు రాజకీయ వర్గాలలో. టిడిపి నాయకులు కూడా నరేంద్రమోడీ తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పుడున్న రెండు కేంద్ర మంత్రి పదవులతోపాటు కొత్తగా మరో పదవిని టిడిపి ఆశించింది. ఒకరు క్యాబినెట్‌ మంత్రి, ఒకరు సహాయ మంత్రిగా టిడిపి నుంచి కేంద్రంలో ఉన్నారు. వారిని అలాగే ఉంచి, కొత్త ఛాన్స్‌ ఇవ్వాలని చంద్రబాబు […]

కామినేని తురాణం న సిగ్గు న లజ్జ

విజయవాడ ఆలయాల తొలగింపు వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఆధునీకణ పేరుతో ఆలయాలు తొలగించడాన్ని విశ్వ హిందూ పరిరక్షణ సమితి ఖండించింది. అయితే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేఖంగా వారు బెజవాడ వినాయక గుడి వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభకు మంత్రి కామినేని ముఖ్య అతిధిగా హాజయ్యారు. సభలో భక్తులకు పలు హామీలు ఇచ్చారు. తొలగించిన ఆలయాలు విగ్రహాలను పునఃప్రతిష్టేంచుదుకు కృషి చేస్తానన్నారు. భక్తులను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. అధికారుల తప్పిదం వల్లే ఇదంతా జరిగిందన్నారు. […]

నా గూడు చెదిరింది:ఎరబ్రెల్లి

టిడిపిలో సీనియర్ నాయకుడిగా వరుసగా ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైనా వ్యక్తిగా తెలంగాణ రాజకీయాలలో ఎర్రబెల్లి ద యాకర్‌రావుకు పేరుంది. కానీ ఆయన పసుపు కండువా మార్చి గులాబీ కం డువా వేసుకోవడంతో సీనంతా ఒక్కసారిగా రివర్స్ అయింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ పార్టీ అధ్యక్షులు చంద్రబాబుకు సన్నిహితునిగా ముద్రపడ్డ దయాకర్‌రావు టిఆర్ఎస్ లో మాత్రం ఆ స్థాయి గుర్తింపు లభిం చడం లేదు. పార్టీ మారే సందర్బంలో తనకు కేబినెట్ మంత్రి హోదా గ్యారెంటీ […]

జనాలకి ఎరుపుకలలు చూపించిన బాబు కేసీర్

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వద్దన్నవే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ముద్దు అవుతున్నవిచిత్రం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. తెలంగాణలో టిఆర్ఎస్, ఏపిలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినయితే వ్యతిరేకించాయో, ఇప్పుడు ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత అవే కంపెనీలు దర్జాగా రెండు రాష్ట్రాల్లోనూ వెలిగిపోతున్న వైనం రెండుపార్టీల నేతల్లోనూ విస్మయానికి గురిచేస్తోంది. తెలంగాణ ప్రాజెక్టుల పనులన్నీ ఆంధ్రా పెట్టుబడిదారులకే అప్పగించి, సీమాంధ్ర పాలకులు తెలంగాణను దోపిడికి గురి చేస్తున్నారని, తెరాస ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించింది. ఎన్నికల తర్వాత […]