మదనపల్లెలో టీడీపీకి ఛాన్స్ ఇవ్వని వైసీపీ..!

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి ఆధిక్యం వచ్చేలా కనిపించడం లేదు. ఇంకా నాయకులు సరిగ్గా కష్టపడకపోవడం…వైసీపీ ఎత్తులతో టీడీపీ వెనుకబడిపోతుంది. గత ఎన్నికల్లోనే జిల్లాలో 14 సీట్లకు వైసీపీ 13 గెలిచేసుకుంది..కేవలం కుప్పం సీటు టీడీపీ గెలిచింది. అయితే ఈ సారి కుప్పం సీటుని కూడా గెలుచుకుంటామని వైసీపీ చెబుతోంది. వైసీపీ చెప్పినట్లుగా అదే జరిగే పని కాదు. ఈ సారి వైసీపీకి సీన్ రివర్స్ అయ్యే చాన్స్ ఉంది. అలా అని వైసీపీ ఆధిక్యం […]

దేవినేనికి బొమ్మసాని సినిమా..మైలవరంలో సైకిల్‌కు సెగలు.!

అధికార వైసీపీలోనే కాదు..ప్రతిపక్ష టీడీపీలో కూడా అసంతృప్తి సెగలు, ఆధిపత్య పోరు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణ జిల్లాలోని మైలవరంలో అటు వైసీపీలోనూ, ఇటు టీడీపీలో సైతం ఆధిపత్య పోరు కొనసాగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు వ్యతిరేకంగా మంత్రి జోగి రమేష్ వర్గం పనిచేస్తుంది. అసలే ఆయనపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ సమయంలో జోగి వర్గం మరింత ఎక్కువగా వసంతని నెగిటివ్ చేస్తుంది. వైసీపీలో పరిస్తితి అలా ఉంటే..టీడీపీలో పరిస్తితి మరొకలా ఉంది. ఇక్కడ మాజీ […]

గోపాలపురం మద్దిపాటికే..ముప్పిడికి వేరే ఛాన్స్.!

మొత్తానికి గోపాలపురం నియోజకవర్గం టీడీపీలో ఉన్న కన్ఫ్యూజన్‌ని చంద్రబాబు క్లియర్ చేసేశారు. ఇక్కడ అసలు అభ్యర్ధి ఎవరు అనే అంశంపై క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా వెస్ట్ గోదావరి టూర్‌లో ఉన్న బాబు..గోపాలపురం నియోజకవర్గంలోని దొండపూడి గ్రామానికి వచ్చారు. ఇక నియోజకవర్గం రాక సందర్భంగా భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. బాబుకు ఘనస్వాగతం పలికారు. అలాగే బాబుతో పాటు ఓ వైపు మద్దిపాటి వెంకటరాజు, మరోవైపు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇక ఇప్పటికే ముప్పిడిని తప్పించి […]

బాబు రాకతో..ఆ నియోజకవర్గాల్లో దశ మారేనా!

మొత్తానికి చంద్రబాబుకు ఆదరణ పెరిగినట్లు కనిపిస్తోంది…కొంతకాలం నుంచి బాబు పర్యటనలకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయన 40 ఏళ్ల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు..ఆయన గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన జిల్లాలకు వస్తుంటే మళ్ళీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో బాబు పర్యటనలకు జనం నుంచి మంచి స్పందన వస్తుంది. సాధారణంగానే అధినేత వస్తున్నారంటే నేతలు తమ పార్టీ శ్రేణులని తరలిస్తారు. అయితే పార్టీ శ్రేణులే కాదు..అక్కడ ఉన్న […]

కందుకూరులో ‘కమ్మ’ని పోరు..సైకిల్‌కు డ్యామేజ్ తగ్గదా..!

తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ పార్టీ అని, ఆ పార్టీలో కమ్మ వర్గమే ఉంటుందని, కమ్మలంతా టీడీపీ వారే అని విమర్శలు వైసీపీ ఎక్కువ చేస్తూ ఉంటుంది. అయితే వైసీపీలో రెడ్డి వర్గం గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ విషయం పక్కన పెడితే..కమ్మలంతా టీడీపీనే అనేది కరెక్ట్ కాదనే వాదన వస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో సగం కమ్మ వర్గం జగన్‌కే మద్ధతు ఇచ్చింది. కమ్మ వర్గం ప్రభావం ఉన్న స్థానాల్లో వైసీపీనే గెలిచింది. దీని […]

ఇదేం ఖర్మ వర్సెస్ గడపగడపకు..జనం నమ్మేది ఎవరిని?

అటు అధికార వైసీపీ…ఇటు ప్రతిపక్ష టీడీపీ..కొత్త కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. తాము చేసిన పనులని ఇంటింటికి వెళ్ళి చెప్పుకోవడమే లక్ష్యంగా వైసీపీ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అటు వైసీపీ వైఫల్యలు, ప్రజలపై మోపిన భారం, కక్ష సాధిస్తున్న విధానాలని ప్రజలకు వివరించడానికి టీడీపీ ఇప్పటికే బాదుడేబాదుడు కార్యక్రమం చేస్తుంది..ఇప్పుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని ప్రోగ్రాం మొదలుపెట్టింది. అయితే రెండు పార్టీల లక్ష్యం ప్రజల ఓట్లు కొల్లగొట్టడమే. ఇక వీరిలో ప్రజలు […]

రావి మరో త్యాగానికి రెడీగా లేరా?

చంద్రబాబు, లోకేష్‌లని పచ్చి బూతులు తిట్టే కొడాలి నానికి చెక్ పెట్టాలని చెప్పి టీడీపీ శ్రేణులు కసిగా ఉన్నాయి. కానీ గుడివాడ నియోజకవర్గంలో మాత్రం టీడీపీలో కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఆ సీటు చివరికి ఎవరికి దక్కుతుంది..ఎవరు పోటీ చేస్తే కొడాలికి చెక్ పెట్టగలరు అనే అంశాలపై క్లారిటీ లేదు. ప్రస్తుతానికి అక్కడ ఇంచార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరావు కష్టపడుతున్నారు. మొదట్లో అంత యాక్టివ్ గా లేరు గాని ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు..వైసీపీపై పోరాటాలు చేస్తున్నారు. […]

వైసీపీకి వెన‌క గొయ్యి…. ముందు నుయ్యేనా…!

రాజ‌ధాని అమ‌రావ‌తిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు.. ఇక్క‌డ అభివృద్ది లో వేగం క‌నిపించాల‌ని, మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేసుకు నే హ‌క్కు, పార్ల‌మెంటు చేసిన చ‌ట్టాన్ని స‌వ‌రించే వెసులుబాటురాష్ట్ర ప్ర‌భుత్వానికి లేద‌ని తేల్చి చెప్పిన విష‌యం తెలిసిందే. దీనిపై సుప్రీంలో పిటిష‌న్ వేసిన వైసీపీ స‌ర్కారుకు మేలు జ‌రుగుతుంద‌ని అనుకున్నారు. ఇది స‌హ‌జం కూడా.. అందుకే ప‌దేప‌దే రాజ‌ధానిపై చేసిన చ‌ట్టాన్ని స‌వ‌రించుకునే హ‌క్కు రాష్ట్రానికి ఉందంటూ వాద‌న‌లు వినిపించారు. అయితే, సుప్రీం కోర్టు మాత్రం దీనిని […]

కవిత వర్సెస్ షర్మిల..కావాల్సింది ఇదే..!

ఎట్టకేలకు తెలంగాణ రాజకీయాల్లో షర్మిల హైలైట్ అవుతుంది…వైఎస్సార్టీపీ పార్టీ పెట్టి తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న షర్మిల అక్కడున్న ప్రధాన పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు.అటు ప్రజల్లో కూడా షర్మిల పార్టీకి ఆదరణ రాలేదు. దీంతో షర్మిల రూట్ మార్చేశారు..పాదయాత్ర చేస్తూ..ఏ నియోజకవర్గంలో తిరిగితే అక్కడ స్థానిక ఎమ్మెల్యేని గాని, స్థానిక మంత్రిని గాని గట్టిగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. తీవ్ర పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. అవినీతి, అక్రమాల ఆరోపణలు చేశారు. అయినా సరే టీఆర్ఎస్ నుంచి అనుకున్న విధంగా […]