అధికారిక రహస్యాలు బయటికి వెల్లడించకూడదు.. అందులోనూ పార్టీలో అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలు అందరికీ చెప్పేస్తే ఎలా ఉంటుందో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి బాగా తెలిసి వచ్చుంటుంది. రాజకీయాల్లో నోరుజారకూడదు.. పాపం అలా చేసినందుకే ఆయనకున్న చీఫ్ విప్ పోస్టు కూడా పోయిందనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. పల్లె రఘునాథరెడ్డి అత్యుత్సాహం ఇప్పుడు ఆయనకున్న ఒక్కగానొక్క పదవి కూడా పోయేలా చేసిందనే గుసగుసలు అసెంబ్లీ లాబీల్లో వినిపిస్తున్నాయి. మంత్రి పదవి పోయినందుకే తీవ్ర మనోవేదనతో ఉన్న పల్లె […]
Category: Latest News
ఆ జిల్లా అధ్యక్ష పదవికి ఇంత పోటీనా?
ప్రకాశం జిల్లా టీడీపీలో నాలుగు స్తంభాలాట మొదలైంది. దీనికోసం పార్టీలోని సీనియర్లు, కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు జోరుగా పావులు కదుపుతున్నారు. ఈ పీఠాన్ని దక్కించుకుని తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎవరికి వారు లాబీయింగ్ చేసుకుంటూ.. హైకమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం ఒకరు.. గుర్తింపు కోసం మరొకరు.. ఇలా ఎవరి అవసరాలు వారివి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. హైకమాండ్ ఆశీస్సులు పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రకాశం […]
సినిమాల్లో అన్నయ్య.. రాజకీయాల్లో తమ్ముడు
టాలీవుడ్ టాప్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఇటీవల సంక్రాంతి బరిలోనూ వీరు ఢీ అంటే ఢీ అన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో నందమూరి బాలకృష్ణకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నాడు. అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్.. ఈ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ జిల్లాలోని హిందూపురం నుంచి బాలయ్య బరిలో ఉండటం, ఆయనపై ఇటీవల […]
రాధా.. జగన్ల బంధానికి బీటలు..
విజయవాడలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వంగవీటి వంశ వారసుడు వంగవీటి రాధాకృష్ణకి వైసీపీ అధినేత జగన్కి బెడిసి కొట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయంగా వైసీపీకి కొంతకాలంగా తటస్థంగా ఉంటూ వస్తున్న రాధాని యువ నాయకత్వం నుంచి జగన్ ఇటీవల తప్పించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రాధా.. జగన్ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వాస్తవానికి తండ్రి రంగా నుంచి వచ్చిన వారసత్వంతో కాంగ్రెస్లో తన కంటూ గుర్తింపు పొందిన […]
తమిళనాట బీజేపీ ఆట షురూ?!
`తమిళనాడు రాజకీయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో అస్సలు కేంద్రం వేలు పెట్టదు. తమిళనాట జరుగుతున్న పరిణామాలకు కేంద్రానికీ ఎటువంటి సంబంధం లేదు` ఇదీ కొంతకాలంగా బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు పదే పదే చెబుతున్న మాట. కానీ ఆ మాటలన్నీ నీటి మూటలేనని తేలిపోయింది. ఏకంగా సచివాలయంలోనే కేంద్రమంత్రి.. రాష్ట్ర మంత్రులతో సమావేశమయ్యే స్థాయిలో ఉన్నారంటే.. తమిళనాట పరిస్థితులను కేంద్రం ఎంతవరకూ తన చెప్పు చేతల్లో పెట్టుకుంటే అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. `అమ్మ` […]
పాలనలో వెనుకబడిన రెండు రాష్ట్రాలు
విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాయని టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు ఊదరగొడుతున్నారు. అయితే ఇది ప్రచార ఆర్భాటమేనని పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ విడుదల చేసిన ఇండెక్స్ లో బట్టబయలైంది. కొన్ని అంశాల్లో ముందు వరుసలోనూ, మరికొన్ని అంశాల్లో చివరిస్థానంలోనూ ఏపీ, తెలంగాణ ఉండటం గమనార్హం! పాలనాపరమైన అంశాల్లో తెలంగాణ వెనుకబడి ఉందని తేల్చింది. ఏపీ కూడా ఇదే బాటలో ఉందని వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ 10 అంశాల […]
గ్రామస్థాయిలో బలోపేతానికి జనసేనాని దూకుడు
రెండేళ్లలో ఎన్నికలు వస్తున్న తరుణంలో.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జనసేనాని అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాడు. పార్టీని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాడు. పార్టీని బలోపేతం చేయడం లేదని, అసలు గ్రామస్థాయిలో పార్టీ ఎక్కడ ఉందో తెలియడం లేదంటూ వస్తున్న విమర్శలకు చెక్ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవలే తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన పవన్.. ఇప్పుడు అంతేవేగంగా రంగంలోకి దిగిపోయారు. జనసేన సేవాదళ్ను ప్రారంభించి.. మరోసారి దూకుడును ప్రదర్శించాడు. ప్రజాసేవ చేసేందుకు […]
సోషల్ మీడియాకు లోకేష్ మళ్లీ దొరికారా?
పార్ట్ టైం పొలిటీషియన్.. ఈ పదం ఏపీ రాజకీయాల్లో విపరీతంగా వినిపిస్తోంది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో అడుగు లేస్తున్న టీడీపీ అధినేత తనయుడు, మంత్రి నారా లోకేష్ కొంతమందిని ఉద్దేశించి `పార్ట్టైం పొలిటీషియన్` అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడు. మరి పవన్ కోటా అయిపోయింది.. ఇప్పుడు జూనియర్ కూడా స్పందిస్తాడా? లేదా అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ లోకేష్పై సెటైర్లు పడుతున్నాయి. పార్టీలో […]
టీడీపీ మంత్రిని టార్గెట్ చేసిన బీజేపీ మంత్రి
ఏపీ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీజేపీ-టీడీపీ మధ్య మిత్ర బంధం తెగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత జగన్..ప్రధాని మోదీతో భేటీ అనంతరం అటు బీజేపీ, ఇటు టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసలే హీట్ పెరిగిపోతున్న సమయంలో కేబినెట్లోని బీజేపీ మంత్రి.. మరో టీడీపీ మంత్రిని టార్గెట్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లు మారింది. మద్యం అమ్మకాల విషయంలో తీవ్ర విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న […]
