గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధాని పదవి చేరుకోవడానికి మోడీ ఎన్ని వ్యూహాలు రచించారో తెలిసిందే! తెరమీద ఆయన ఎంత కష్టపడ్డారో.. తెరవెనుక ఉండి ఈ వ్యూహాలను పక్కాగా అమలు చేసి అఖండ విజయాన్ని అందించిన వ్యక్తి!! ఏడాది తిరిగేలోగా.. అదే మోడీ హవాను తట్టుకుని.. బిహార్లో నితీశ్-లాలూ జోడీని పట్టాలెక్కించేలా చేసిన వ్యక్తి కూడా ఒకరే!! ఆయనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్!! ఆయన వ్యూహాలకు ఎదురులేదు.. ఆయన ఎటు ఉంటే అటే విజయం! అందుకే ఏపీ […]
Category: Latest News
ముందస్తు ఎన్నికలకే ఏపీ డిమాండ్లు ఇవే
ఎన్నికలు జరిగి మూడేళ్లు ఇంకా పూర్తవలేదు. కానీ అప్పుడే ఎన్నికల మాట దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. అంతేగాక ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే సమయంలో అన్ని రాష్ట్రాలూ అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఇప్పుడు ఈ ముందస్తు ఎన్నికల గురించి లీకులిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. […]
జగన్ను ముంచేసిన శిల్పా మోహన్ రెడ్డి
ఇంకేముంది పార్టీలోకి వచ్చేస్తానని వైసీపీ నేతలకు లీకుల మీద లీకులు ఇచ్చారు! ఇక రేపో మాపో పార్టీలో చేరిపోవడం ఖాయమని ఆశ చూపారు! ఆయన వస్తారని, దీంతో టీడీపీకి దెబ్బమీద దెబ్బ పడినట్టేనని వైసీపీ అధినేత జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరి ఊరించి.. ఉసూరుమనిపించారు శిల్పా మోహన్రెడ్డి! అంతేగాక తన అవసరాల కోసం వైసీపీని వాడుకుని నట్టేట ముంచారు. నంధ్యాల రాజకీయంలో జగన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శిల్పా మోహన్ రెడ్డి.. వైసీపీలోకి వెళ్లడం […]
టీఆర్ఎస్లో బాబు మోహన్ పనైపోయిందా..!
సినీనటుడు బాబు మోహన్.. టీఆర్ఎస్లో చేరి ఆందోల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ నాయకులందరితోనూ ఆయనకు సత్సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. కానీ ఆయన నియోజకవర్గంలో మాత్రం ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సర్వేలో బాబూ మోహన్కు అతి తక్కువ మార్కులే రావడం.. ఆయనకు చిక్కులు తెచ్చిపెడుతోంది. అంతేగాక ఆయన నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు ఎక్కువ మార్కులు పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక టీఆర్ఎస్లో ఆయన శకం దాదాపు ముగిసినట్టేననే […]
ఆ జిల్లాపై జగన్ ఆశలు వదులుకున్నాడా..!
వెనుకబడిన జిల్లాగా పేరొందిన సిక్కోలులో వైఎస్సార్ సీపీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. నేతల మధ్య అంతర్గత రాజకీయాలు, విభేదాలు, సమన్వయ లోపం ఇవన్నీ పార్టీని మరింత దిగజారుస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేతల పట్టు ఈ జిల్లాపై తగ్గుతూ ఉంటే.. అధికార పార్టీ నాయకుల హవా నానాటికీ పెరుగుతోంది. ఇంత జరుగుతున్నా.. వైసీపీ అధినేత జగన్ జిల్లా రాజకీయాలపై దృష్టిపెట్టకపోవడం ఇప్పుడు అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జిల్లాలో కీలకమైన నాయకులు పొంతన లేకుండా వ్యవహరిస్తున్నా.. వాటన్నింటినీ సరిజేసి ఏకతాటిపైకి […]
ఫిరాయింపు మంత్రికి టీడీపీ నేతల షాక్
ప్రతిపక్ష వైసీపీలో గెలిచి.. సైకిలెక్కి మంత్రి పదవి పొందిన మంత్రులకు స్థానిక టీడీపీ నేతలు షాక్ ఇస్తున్నారు. ఇటీవలే వీరికి మంత్రి పదవులు ఇవ్వడంపై ఆగ్రహ జ్వాలలు చెలరేగడం.. వాటని తన చాకచక్యంతో సీఎం చంద్రబాబు అణగదొక్కడం ఇవన్నీ తెలిసిందే! అయితే పరిస్థితి అంతా సద్దుమణిగిందని భావించినా.. ప్రస్తుతం ఇంకా ఈ జ్వాలలు ఇంకా చల్లారలేదు. ఆ మంత్రులను తమలో కలుపుకునే పరిస్థితి టీడీపీలో లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి సుజయ్ కృష్ణ […]
టీడీపీలో అన్నదమ్ముల ఫైటింగ్
పచ్చని కుటుంబంలో రాజకీయాలు చిచ్చుపెట్టాయి. ఆప్యాయంగా పెరిగిన అన్నతమ్ముళ్ల మధ్య అగాధాన్ని సృష్టించాయి. ప్రస్తుతం ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అన్న ఎదుగుదల చూసి, తొక్కేయాలని భావిస్తున్న తమ్ముడు.. తమ్ముడు ఎక్కడ తనకు పోటీగా మారతాడోనని అన్న.. ఇలా ఒకరినొకరు తీవ్ర పొరపచ్చాలతో రాజకీయాలు చేస్తున్నారు. అన్నతమ్ముళ్ల ఫైటింగ్ ఇప్పుడు టీడీపీ క్యాడర్ని అయోమయానికి గురిచేస్తోంది. కొండపల్లి బ్రదర్స్ మధ్య విభేదాలు విజయనగరం జిల్లాలో టీడీపీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. జిల్లాలో ఒకప్పుడు కొండపల్లి పైడితల్లినాయుడు […]
బీజేపీకి ప్లస్.. కేసీఆర్కు మైనస్
ప్రత్యర్థులను తన వ్యూహాలతో చిత్తు చేయగల తెలంగాణ సీఎం కేసీఆర్.. తాను తీసుకున్న గోతులో తానే పడబోతున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులను ఇరుకున పెట్టబోయి.. తానే ఇరుక్కబోతున్నారా అని విశ్లేషకులు సందేహపడుతున్నారు. మైనారిటీలకు రిజర్వేషన్ అంశం.. కేసీఆర్కు లాభం చేకూర్చబోయి.. నష్టం కలిగిస్తుందా అనే ఆందోళన మొదలైంది. బీజేపీని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ అయ్యే అవకాశాలున్నాయనే అనుమానాలు అందరిలోనూ రేకెత్తుతున్నాయి. 2014లోగానీ,మొన్నటి యూపీ ఎన్నికల్లో గానీ బీజేపీ అధికారంలోకి […]
జగన్కు మద్దతుగా వైసీపీ ఎంపీ కొత్త న్యూస్ ఛానెల్
రాజకీయ పార్టీలకు మీడియా అండ తప్పనిసరి అయిన రోజులివి. అందుకే ఏదో ఒక పార్టీకి ఏదో ఒక మీడియా.. తన వంతు సాయం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీకి మద్దతు ఇచ్చే మీడియానే ఎక్కువగా ఉండగా.. ప్రతిపక్షాన్ని పట్టించుకునే మీడియా ఒకే ఒక్కటి ఉంది. ఈ ఆంతర్యాన్ని తగ్గించేందుకు వైసీపీ నడుం బిగించింది. వైసీపీని ప్రొజెక్టు చేసేందుకు ఆ పార్టీ ఎంపీ రంగంలోకి దిగారు. ఏకంగా ఇప్పుడు ఆయన ఒక చానెల్ను త్వరలో ప్రారంభించబోతున్నారు. […]