రేవంత్ స్టాండ్ మార్చుకున్నాడా?

తెలంగాణ టీడీపీ నేత‌ల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి రూటు మారుతోందా? పొలిటిక‌ల్‌గా ఆయ‌న స్టాండ్ ఏమిటి? వంటి ప‌లు అనుమానాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి కార‌ణం ఇటీవ‌ల ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరే! టీఆర్ ఎస్‌పై రేవంత్ ఎలా రెచ్చిపోతాడో అంద‌రికీ తెలిసిందే. అంతేకాదు, ఆట మొద‌లైంది అంటూ.. అప్ప‌ట్లో ఓటుకు నోటు కేసులో జైలు నుంచి వ‌చ్చాక చేసిన స‌వాలు కూడా అంద‌రికీ గుర్తింది. అయితే, అనూహ్యంగా ఆయ‌న తీరు మారిపోయింది. ఒక్క‌సారిగా […]

ఆ రెండు విష‌యాల‌తోనే బాబు ఫైట్‌!!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఇప్పుడు కంటిపై కునుకులేకుండా పోతోంద‌ట‌. ఫుల్లు ఏసీలోనూ ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయ‌ట‌! దీనికి కార‌ణం.. ఓ రెండు విష‌యాల‌ని అధికారులు చెబుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి సీఎం సీటును ప‌దిలం చేసుకోవాల‌ని భావిస్తున్న చంద్ర‌బాబు.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌ధానంగా రెండు విష‌యాల‌ను ఎంచుకున్నారు. ఎక్క‌డ ఏ స‌భ‌లో మాట్లాడినా ఆరెండు విష‌యాలు చెప్ప‌కుండా ఆయ‌న ఉండ‌లేక‌పోతున్నారు. దీంతో ఆ రెండు విష‌యాలే ఇప్పుడు ఆయ‌న‌కు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయ‌ట‌. ఇంత‌కీ […]

క‌మ్యూనిస్టుల‌కు ప‌వ‌న్ దెబ్బేశాడుగా! 

త‌న‌కు క‌మ్యూనిస్టులంటే గౌర‌వం ఉంద‌ని, వాళ్ల భావ‌జాలం.. త‌న భావ‌జాలంలో సారూప్య‌త ఉంద‌ని.. అవ‌స‌ర‌మైతే వాళ్ల‌తో క‌లిసి ప‌నిచేసేందుకైనా సిద్ధ‌మేన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ సంకేతాలు ఇస్తూ వ‌స్తున్నాడు. దీంతో క‌మ్యూనిస్టులు కూడా ప‌వ‌న్ త‌మ‌తో దోస్తీక‌డ‌తాడ‌ని ఆశాభావం వ్య‌క్తంచేశారు. అయితే వారికి ప‌వ‌న్‌.. కూడా హ్యాండ్ ఇచ్చాడు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, విశాఖ భూ కుంభ‌కోణంపై ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని, ఇందుకు ప‌వ‌న్ కూడా తోడ‌యితే త‌మ‌కు మైలేజ్ వ‌స్తుంద‌ని భావించిన క‌మ్యూనిస్టుల ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. […]

నారా బ్రాహ్మ‌ణిపై వైసీపీ అభ్య‌ర్థి ఖ‌రారే..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కోడ‌లు, హిందూపురం ఎమ్మెల్యే న‌టుడు బాల‌య్య బాబు కుమార్తె బ్రాహ్మ‌ణి రాజ‌కీయ ప్ర‌వేశంపై ఇప్ప‌టికే కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, తాజాగా ఆమె ఎక్క‌డి నుంచి పోటీ చేస్తుంది? అనేది కూడా లీకైపోయింది. బ్రాహ్మ‌ణిని లోక్ స‌భ కు పంపాల‌ని బాబు గ‌త కొన్నాళ్ల కింద‌టే డిసైడ‌య్యారు. దీంతో ఆమెను గుంటూరు నుంచి ఎంపీగా పంపితే బాగుంటుంద‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ అల్లుడు గ‌ల్లా జ‌య‌దేవ్ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా […]

ఈ టీడీపీ సిట్టింగ్ ఎంపీల‌కు 2019లో సారి

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ సారి టిక్కెట్ల విష‌యంలో కాస్త క‌టువుగానే వ్య‌హ‌రిస్తారా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలిచి వ‌రుస‌గా ఏపీకి రెండో సీఎం అయ్యేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోన్న బాబు చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెట్టేయ‌నున్నారా ? అంటే తాజా రాజ‌కీయ ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్ల‌లో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి 4 సీట్లు ఇవ్వ‌గా 21 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో […]

టీడీపీకి మ‌రోసారి షాక్ ఇచ్చిన మోదీ

మిత్ర‌ప‌క్షం మాట‌లు గాలిలో క‌లుస్తున్నాయి. మిత్ర ధ‌ర్మానికి బీట‌లు వారేలా ఉన్నాయంటూ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుతోంది. అటు ఢిల్లీలోని బీజేపీకి ఇటు ఏపీలోకి వైసీపీకి మ‌ధ్య బంధం బ‌లోపేతం అవుతోంది. క‌మ‌లం చెంత‌కు ఫ్యాన్ క్ర‌మ‌క్రమంగా ద‌గ్గ‌ర‌వుతోంది. ప్ర‌ధాని మోదీ, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ క‌ల‌యిత‌తో బీజం ప‌డిన స్నేహ బంధం.. రాష్ట్రప‌తి ఎన్నిక నేప‌థ్యంలో మ‌రింత చిగురించింది. రాష్ట్రప‌తి అభ్య‌ర్థుల నామినేష‌న్ ప్ర‌క్రియ‌కు వైసీపీకి కూడా ఆహ్మానం అంద‌డం.. ఏపీలో మ‌రోసారి […]

నంద్యాల‌లో కాంగ్రెస్ టార్గెట్ ఎవ‌రు?

విభ‌జ‌న త‌ర్వాత‌ ఏపీలో కాంగ్రెస్ అస్తిత్వం కోసం పోరాడుతోంది. సరైన స‌మ‌యంలో ఉనికి చాటాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. వీలైనంత వ‌రకూ పోటీలో నిలిచి అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను దెబ్బ‌తీయాల‌ని చూస్తోంది! ఇప్పుడు ఆ స‌మయం వ‌చ్చింద‌ని భావిస్తోంది. నంద్యాల ఎన్నిక‌ల‌ను స‌రైన వేదిక‌గా చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. ప్ర‌స్తుతం నంద్యాల‌లో అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ బ‌రిలోనే నిలుస్తుండ‌గా.. ఇప్పుడు పోటీలో మేము కూడా ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది. ఇదే ఇప్పుడు వైసీపీ, టీడీపీ నేత‌ల్లో గుబులు పుట్టిస్తోంది. కాంగ్రెస్ గెల‌వ‌క‌పోయినా.. […]

దిక్కుతోచని పరిస్థిలో టీఆరెస్ ఎమ్మెల్యే

తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బ‌తో అధికార టీఆర్ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేకు జ్వ‌రం ప‌ట్టుకుంద‌ట‌. వచ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ త‌న‌కు టిక్కెట్ ఇవ్వన‌న్న ఫ్రీల‌ర్లు వ‌ద‌ల‌డంతో ఇప్పుడు స‌ద‌రు ఎమ్మెల్యే త‌న బాధ ఎవ‌రికి చెప్పుకోవాలో అర్థంకాక మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నార‌ట‌. ఇక తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది ఎంపీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాల‌ని అనుకుంటున్నారు. ఈ జాబితా చాలానే ఉంది. ఈ జాబితాలోకి కొత్త‌గా వ‌చ్చి చేరారు మెద‌క్ ఎంపీ కొత్త […]

పాల‌కొల్లు మ‌రో గ‌ర‌గ‌ప‌ర్రు అవుతోందా..!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని గ‌ర‌గ‌పర్రు ప్ర‌స్తుతం అట్టుడుకుతోంది. అక్క‌డ ద‌ళిత‌వ‌ర్గాల‌కు చెందిన వారిని వెలివేశార‌న్న వార్త‌ల‌తో ఆ గ్రామం పేరు ఇప్పుడు మీడియాలో మార్మోగుతోంది. గ‌ర‌గ‌ప‌ర్రులో ద‌ళితులంతా ఉద్య‌మిస్తుంటే ఇప్పుడు అదే జిల్లాలోని పాల‌కొల్లు కేంద్రంగా బీసీలంతా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడుకు యాంటీగా ఒక్క‌ట‌వుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాల నేప‌థ్యంలో జిల్లాలోని బీసీల‌తో పాటు కోన‌సీమ‌లో బ‌ల‌హీన‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన ఓ ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గం మొత్తం నిమ్మ‌ల‌కు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తుతోంది. నిమ్మ‌ల పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గంలో […]