ఛీ ఛీ నాకు ఎంతో సిగ్గుచేటుగా ఉంది “..అనసూయ షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడిన వివాదంగానే మారుతుంది . మరి ముఖ్యంగా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసిన తర్వాత అనసూయ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ఆమె నటించిన ఓ సినిమాకి సంబంధించిన పాటను రిలీజ్ చేసే క్రమంలో ఆమె మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి . యాంకర్ అనసూయ తాజాగా నటించిన సినిమా రజాకర్ .

ఈ సినిమా ఆమె ఎంతో ఇష్టంగా నటించాను అంటూ చెప్పుకొచ్చింది . ఈ సినిమాలో ఓ పాటను రిలీజ్ చేస్తున్న క్రమంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న అనసూయ ఈ సినిమాలో నటించడానికి గల కారణాన్ని వివరించింది . “ఇది జరిగిన చరిత్ర.. నేను ఉన్న ఈ ప్రాంతంలో ఇంత జరిగిందా ..? అని నాకు నాకే తెలియదు.. ఇంత జరిగిందా..? అని తెలుసుకొని నేను ఈ సినిమా చేశాను. నిజం చెప్పేందుకే నేను ఈ సినిమాలో నటించాను ..ఇది కల్పిత కథ కాదు ట్రూ .. ఇది మొత్తం అంతా నిజంగా జరిగిన కథ.. నాకు ఎంతో సిగ్గుచేటుగా ఉంది.. నేను ఉన్న ఇలాంటి ప్రాంతంలో ఈ విధంగా జరిగిందా ..? నేను తెలుసుకున్నాను మీరు అందరూ తెలుసుకోండి ..ఇలాంటి ఓ సినిమా వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు “.

“నేను ఈ సినిమాలో నటిస్తాను అని అస్సలు అనుకోలేదు.. ఈ సినిమాలో నటించినందుకు చాలా చాలా గర్వంగా ఉంది.. ఇకపై ఇలాంటి అవమానీయ ఘటనలు జరగకుండా ఉండాలి అని ఆశిస్తున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగబోతుంది..? అని తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నా వంతుగా ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. మన చరిత్రను తెరపైకి తీసుకొస్తున్న దర్శక నిర్మాతలకు థాంక్యు వెరీ మచ్ అంటూ కామెంట్ చేసింది..!!