మెగా డాటర్, నాగబాబు ముద్దులు కుమార్తె నిహారిక కొణిదెల భర్త చైతన్య జొన్నలగడ్డతో తెగదెంపులు తీసుకుంది. గుంటూరు ఐజీ కుమారు అయిచన చైతన్యను నిహారిక 2020లో వివాహం చేసుకుంది. అప్పట్లో వీరి పెళ్లిని రాజస్థాన్ లో నాగబాబు అత్యంత ఘనంగా చేశారు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిహారిక పెళ్లిలో సందడి చేశారు. అయిన పెళ్లి జరిగిన రెండేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో.. విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.
కూకట్పల్లిలోని కుటుంబ న్యాయస్థానం తాజాగా నిహారిక, చైతన్య జంటకు విడాకులు మంజూరు చేసింది. మే 19 న వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. జూన్ 5న విడాకులు మంజూరు అయ్యాయి. అయితే విడాకులు ముందుగా కోరింది మాత్రం చైతన్యనే అట.
వీరిద్దరూ కోర్టులో చేసిన పిటిషన్ ప్రకారం.. ముందుగా చైతన్యనే విడాకులకు దరఖాస్తు చేసినట్లు తేలిపోయింది. అయితే ఎందుకు విడిపోయారు అన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు. వీరిద్దరి మధ్య ఏర్పడిని మనస్పర్థలకు కారణం ఏంటో తెలియలేదు. అయితే గత కొంత కాలం నుంచి వీరిద్దరి మధ్య సఖ్యత లేదని ప్రచారం జరుగుతూనే ఉంది. విడాకులకు అప్లై చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రచారమే నిజం అవ్వడంతో మెగా ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు.