దివంగత అతిలోక సుందరి శ్రీదేవి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె సంపాదించుకున్న కీర్తిని సినిమా ఉన్నంత వరకు ఎవరూ మర్చిపోలేరు. శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్లు పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటించాలని చాలాకాలంగాా ఎదురుచూస్తుంది.
అదేవిధంగా సౌత్ సినిమా దర్శక నిర్మాతలు కూడా ఆమెను ఈ సినిమాలలో నటింప చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు సౌత్ లో జాన్వీ కపూర్ ఏ సినిమాలోను నటించలేదు. గత కొంతకాలంగా తెలుగులో ఎన్టీఆర్ కు ఈమె జంటగా నటిస్తుందంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. కానీ ఇది ప్రచారానికే పరిమితమైంది.
తాజాగా ఈ బ్యూటీ కోలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ దర్శకుడు లింగుసామి 13 ఏళ్ల క్రితం కార్తీ, తమన్నా జంటగా తెరకెక్కించిన పయ్యా ( తెలుగులో ఆవారా) సినిమా మంచి విజయం సాధించింది. రోడ్డు ట్రావెలింగ్ కథగా ఈ సినిమా రూపొందింది. తాజాగా లింగుసామి ఆ సినిమాకు సిక్వెల్ తెరకెక్కించేందుకు సన్న హాలు చేస్తున్నాడు. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.
అయితే ఇప్పుడు ఈ సినిమాలో మొదటి భాగం లో నటించిన కార్తీ, తమన్నా సీక్వెల్ లో నటించడం లేదట. ఇందులో హీరోగా ఆర్య, ఆయనకు జంటగా జాన్వీ కపూర్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాపై త్వరలోనే అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వార్త నిజమైతే మాత్రం జాన్వీ కపూర్ సౌత్ లో నటించే తొలి సినిమా కూడా ఇదే అవుతుంది.