మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ కాంబోలో త్వరలోనే ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అయితే ఈ చిత్రం ఓ మల్టీస్టారర్ అని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ విషయాన్ని బాబీ కూడా ధృవీకరించాడు. తాజాగా బాబీ చిరు సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయట పెట్టారు. ఇది ఓ స్టార్ కీ అభిమానికీ మధ్య జరిగే కథ అని బాబీ తెలిపారు. ఇక స్టార్గా చిరంజీవి నటిస్తే.. అభిమానిగా మరో హీరో నటించనున్నాడట.
అయితే ఆ మరో హీరో ఎవరన్నది త్వరలోనే తెలియనుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్ నటించనుందని ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న చిరు.. మోహన్ రాజా డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్, మెహర్ రమేశ్ డైరెక్షన్లో వేదాలమ్ రీమేక్ చిత్రాలు చేయనున్నాడు. ఈ రెండు పూర్తి అయిన వెంటనే బాబీ సినిమా పట్టాలెక్కనుంది.