ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేసి బన్నీ ఆ తర్వాత వైసిపి క్యాండిడేట్.. శిల్పా రవికి సపోర్ట్ చేయడం పెద్ద దుమారమే రేపింది. దానికి తగ్గట్టే నాగబాబు కూడా “మాకు సపోర్ట్ చేయనివాడు మా వాడు అయిన పరాయి వాడే” అంటూ ఘాటుగా స్పందించారు .
దీంతో బన్నీ కూడా అల్లు రామలింగయ్య గారు లేకపోతే టైర్లకు పంచర్లు వేసుకునే వాడివి అంటూ ఘాటుగా ట్విట్ పెట్టారు . మొత్తానికి సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫాన్స్ మధ్య వార్ రచ్చ రంబోలాగా మారిపోయింది . అయితే వీడికి చెక్ పెట్టేందుకు చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మే 4వ తేదీ దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా డైరెక్టర్స్ డేని జరుపుకుంటూ వస్తున్నారు . అయితే అప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నందు కారణంగా..ఇప్పుడు మే 19న ఈ సభ నిర్వహించబోతున్నారట.
అయితే ఈసారి డైరెక్టర్స్ డే ని భారీ ఎత్తున నిర్వహించాలి అంటూ ఫిక్స్ అయ్యారట సినీమండలి. ఈ క్రమంలోనే ఈ వేడుకకు సినిమా ఇండస్ట్రీలో ఉండే అందరి ప్రముఖులని హాజరవ్వాలి అంటూ చెప్పుకొచ్చారట . అయితే ఈవెంట్లో ఒకే వేదికపై చిరంజీవి – పవన్ కళ్యాణ్ – నాగబాబు – అల్లు అర్జున్ మెరుగబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో ఎవరైతే మెగా వర్సెస్ అల్లు ఫాన్స్ మధ్య చిచ్చుపెట్టాలి అనుకుంటున్నారో.. వాళ్ళ నోర్లు మూయించడానికి ఈ విధంగా చేస్తున్నాడు చిరంజీవి-అల్లు అరవింద్ అన్న వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. కొందరు దీనిని ట్రోల్ చేస్తున్నారు. మీ పరువు మర్యాదల కోసం ఎంతకైన తెగిస్తారా..? అంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు..!!