ఆ విషయంలో హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. అసలు ఏం జరిగిందంటే..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదానికి సంబంధించి ఓ న్యూస్ నెటింట‌ వైరల్ అవుతుంది. తన ఇంటి స్థలం గొడవలో తెలంగాణ హైకోర్ట్‌కు పిటిషన్లు దాఖలా చేశాడు తార‌క్‌. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల సైట్ విషయంలో వివాదం చోటుచేసుకుంది. గీత అనే ఓ మహిళ నుంచి 2003లో ఆ స్థ‌లాని చట్ట ప్రకారం అనుమతులు తీసుకున్న తర్వాతే కొనుగోలు చేసి ఆ ఏడాది ఇంటి నిర్మాణం మొదలుపెట్టానని.. తార‌క్ వివరించాడు.

Telugu actor Jr NTR tests negative for Covid-19 - OrissaPOST

అయితే ఆ భూమిని ఎన్టీఆర్‌కు అమ్మిన వ్యక్తులు 1996లోనే తమ వద్ద భూమి తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారంటూ ఎస్బిఐ ఓరియంటల్, బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండస్ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ప్లస్ ప్రకారం డేట్ రికవరీ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు. తాజాగా బ్యాంకులకు అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. కాగా బ్యాంక్ నోటీసులను ఛాలెంజ్ చేస్తూ మొదటి డిఆర్టిలో తార‌క్‌ పిటిషన్ వేయ‌గా అక్కడ వాదనలు విన్న డిఆర్టి ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులు ఉంటాయంటూ తీర్పు చెప్పింది.

Jr NTR: హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. | Jr NTR Approach High  Court in Land Issue

దీంతో ఎన్టీఆర్ ఫిర్యాదు ప్రకారం భూమి అమ్మిన గీతాపై కేసు నమోదు చేసి.. ఈ గురువారం ధర్మశాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్ పై జస్టిస్ సుజాతజోయ్‌, శ్రీనివాసరావు ఆమెను విచారించారు. డిఆర్టి కాపీ అందుబాటులో లేకపోవడంతో.. సమయం కావాలని తారక్ తరఫున న్యాయవాది జడ్జ్ ను కోరారు. తదుపరి విచారణ వెకేషన్ బెంచ్ ముందు పోస్ట్ చేయాలని విజ్ఞప్తి చేసిన నిరాకరించిన ధర్మాసనం.. జూన్ 6 కేసు వాయిదా వేసి.. కేసుకు సంబంధించిన వివరాలు డాక్యుమెంట్లను జూన్ 3లోగా సబ్మిట్ చేయాలని తెలియజేసింది.