కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2004లో వివాహం చేసుకున్న ఈ జంటకు యాత్రా, లింగా అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే ఐశ్వర్య, ధనుష్ ను వివాహం చేసుకున్న తర్వాత అతని సోదరుడు సెల్వ రాఘవన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించింది. ఈ క్రమంలో 2012లో రిలీజ్ అయిన మూడు సినిమాలకు ఐశ్వర్య దర్శకురాలుగా వ్యవహరించింది. వాటిలో వైదిస్ కొలవరి డి పాట విపరీతంగా పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లో సాంగ్స్ హిట్ అయినంతగా సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
దీంతో వరుసగా ప్రాబ్లం ఎదుర్కొన్న ఐశ్వర్య.. సినిమాలకు బ్రేక్ ఇచ్చి పర్సనల్ లైఫ్ పై ఫోకస్ చేసింది. అంతేకాదు ఫిట్నెస్ పై ఫోకస్పెట్టి వర్కౌట్లు చేస్తూ వీడియోలను ఎప్పటికప్పుడు తన ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ వచ్చింది. మరోవైపు ధనుష్ హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను దక్కించుకుంటూ లైఫ్ ని సాఫీగా సాగిస్తున్నాడు. ధనుష్, ఐశ్వర్యల జీవితంలో ఒక్కసారిగా విడాకుల కలకలం ఫాన్స్ కు షాక్ ఇచ్చింది. 2022లో వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు.
అయితే వీరు ఇరువైపులా బంధువులతో చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత రెండేళ్లకు వీరిద్దరూ విడాకుల కోసం కోర్టులో అప్పీల్ చేసుకొని అఫీషియల్ గా విరి విడాకులను అనౌన్స్ చేశారు. అయితే కొడుకు మనసు మార్చాలని ధనుష్ తండ్రి కస్తూరి రాజ్ ఎంత ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన తన కొడుకుకు రెండో పెళ్లి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈసారి సినిమాలకు సంబంధించిన అమ్మాయిని కాదని.. తన బంధువుల్లోనే ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడట ధనుష్ తండ్రి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.