పల్లవి ప్రశాంత్ .. నిన్న మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా జనాలకు ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడో.. అప్పటినుంచి ఆయన రైతు బిడ్డగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . హౌస్ లోకి రాకముందు వందమందికి తెలిస్తే హౌస్ లోకి వచ్చాక లక్ష మందికి తెలిసాడు అంతలా తన క్రేజీ పాపులారిటీ దక్కించుకున్నాడు . కాగా రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ ఎపిసోడ్ కి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది .
టాప్ 3 కంటెస్టెంట్లుగా పల్లవి ప్రశాంత్ – అమర్దీప్ – శివాజీ నిలిచారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు బిగ్ బాస్ ట్రోఫీని పల్లవి ప్రశాంత్ ఎగరేసుకొని పోయాడు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు క్రేజే లేని పల్లవి ప్రశాంత్ ఇలా బిగ్ బాస్ ఓటింగ్ లో టాప్ రేంజ్ లో నిలవడం అభిమానులకు షాకింగ్ గా ఉంది .
దీనంతటికీ కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు జనాలు . ఆయన ఫ్యాన్స్ సపోర్ట్ చేయబట్టే పల్లవి ప్రశాంత్ ట్రోపీ గెలుచుకున్నాడు అని .. లేకపోతే ఏ టాప్ ఫైవ్ లోనో టాప్ ఫోర్ లోనే ఉండేవాడు అని చెప్పుకొస్తున్నారు . మరి కొందరు బిగ్ బాస్ విన్నర్ అయినా పెద్దగా ఏం పీకలేడు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు..!!