బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ తో ఒక్కసారిగా ట్రెండింగ్ స్టార్ బ్యూటీగా మారిపోయింది త్రిప్తి దిమ్రి. ఈ సినిమాలో బోల్డ్ బ్యూటీగా మెప్పించిన ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ సడన్ స్టార్ స్టేటస్ గురించి త్రిప్తి మాట్లాడుతూ ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి నాకు అందుతున్న ఈ ప్రేమాభిమానాలకి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటూ చెప్పుకొచ్చింది.
ఈ అనుభూతి నాకు చాలా స్పెషల్.. చెప్పాలంటే నా మొబైల్ ఫోన్ మెసేజ్లతో మోగుతూనే ఉంటుంది.. చివరికి ఈ మెసేజ్లు వల్ల నాకు నిద్ర కూడా ఉండడం లేదు అన్ని మెసేజ్లు వస్తున్నాయి అంటూ వివరించింది. త్రిప్తి మాట్లాడుతూ అవి చదువుతూ రాత్రి టైం స్పెండ్ చేసేస్తున్న.. కానీ నాకు అది నచ్చుతుంది.
ఇక రణ్బీర్ కపూర్ చాలా మంచి యాక్టర్.. చాలా సపోర్టీవ్, రష్మిక మందన కూడా బ్యూటిఫుల్ కోయాక్టర్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక రష్మిక మందన, రణ్బీర్ కపూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో త్రిప్తి దిమ్రితో పాటు బాబి డియోలో, అనిల్ కపూర్ కిలక పాత్రలో నటించారు. ఈ నెల 1న రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఎనిమిది వందల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి రికార్డ్ సృష్టించింది.