టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ ప్రియమణి.. తెలుగులో యమదొంగ, ద్రోణ వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ముఖ్యంగా తన బికినీ అందాలతో ద్రోణ సినిమాలో మరింత రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా మారిపోయింది. తెలుగులో చివరిసారిగా నాగచైతన్య నటించిన కస్టడీ చిత్రంలో నటించింది.
ఆ తర్వాత బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అలా సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న ప్రియమణి తన వ్యక్తిగత జీవితంలోకి వస్తే 2017లో ముస్తఫా రాజును వివాహం చేసుకున్నది.. అయితే ఇది ముస్తఫాకు రెండవ వివాహం. గతంలోని ముస్తఫాకు వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడంతో ప్రియమణిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే ప్రియమణి వివాహం కాకముందే చాలా మంది హీరోలతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉండేవి.
మొదట్లో జగపతిబాబుతో ఈమె ఎఫైర్ ఉందంటూ వార్తలు వినిపించాయి. ఆ సమయంలో జగపతిబాబు ఈమెకు ఖరీదైన కానుకలు కూడా ఇచ్చారని వార్తలు వైరల్ గా మారాయి. అయితే మరొక హీరోయిన్ కారణంగా వీరిద్దరూ విడిపోవడం జరిగిందని సమాచారం. టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు పొందిన తరుణ్ ప్రియమణి నవవసంతం సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారని ఇప్పటికి రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే వీరి వీరి ప్రేమ వివాహాన్ని తరుణ్ తల్లి ప్రియమణిని అడగగా ఆమె అలాంటివి ఏమీ లేవని చెప్పడంతో ఆ వివాహం క్యాన్సిల్ అయింది. ఒకవేళ తరుణ్ భార్య అయి ఉంటే ప్రియమణి మరొక లెవల్ లో ఉండేదని అభిమానులు భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పటికి తరుణ్ సింగిల్ గానే ఉన్నట్లు తెలుస్తోంది.