సినిమా ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా ట్యాగ్ చేయించుకొని మరి తన పేరుని పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ శ్రీదేవి..ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుని సినిమా ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెలుగు హిందీ భాషలలో స్టార్ హీరోయిన్గా మారిపోయి జనాలను తన నటనతో మెప్పించిన శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది .
ఆమె వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఇప్పటివరకు కెరియర్లో ఒక్కటంటే ఒక హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది . ఇలాంటి క్రమంలోనే జాన్వికపూర్ తెలుగులో డెబ్యూ ఇవ్వడానికి సిద్ధపడింది . జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న దేవర సినిమాలో ఫస్ట్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది జాన్వి కపూర్ . దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్లో కూడా పాల్గొంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యి అభిమానులను తెగ ఆకట్టుకునింది .
కాగా ఈ సినిమా సెట్స్ పై ఉండగానే జాన్వి కపూర్ తెలుగులో సెకండ్ సినిమాకు సైన్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . నిన్న మొన్నటి వరకు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో అమ్మడు సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు పెళ్లయిన చరణ్ ను వదిలేసి పెళ్లికాని ఓ కుర్ర హీరో సినిమాకు జాన్వి కపూర్ సైన్ చేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఆ హీరో మరెవరో కాదు అక్కినేని అఖిల్. వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న అక్కినేని అఖిల్ తో తన నెక్స్ట్ సినిమాను ఫిక్స్ చేసుకుందట జాన్వి కపూర్ . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!