టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించారు. ఇటీవల దుబాయ్ లో నిర్వహించిన సైమా 2023 అవార్డు వేడుకలలో పాల్గొనడం జరిగింది. ఈ వేడుకలలో తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడుగా కూడా కొమరం భీమ్ పాత్రకు అవార్డు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. గతంలో జనతా గ్యారేజ్ సినిమాకు ఉత్తమ హీరోగా అవార్డు అందుకున్నారు.
అయితే ఎన్టీఆర్ ఇలా సక్సెస్ కావడానికి కారణం ఏంటనే విషయం ఇప్పుడు అభిమానులలో ఒక సందేహం నెలకొంది. ఎన్టీఆర్ నందమూరి హరికృష్ణ శాలిని దంపతులకు జన్మించిన కుమారుడు హరికృష్ణకు శాలిని రెండో భార్య కావడం చేత ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం దూరం పెడుతూ వస్తోంది. హరికృష్ణ మాత్రం ఒక భర్తగా తండ్రిగా వారి బాధ్యతలను చాలా చక్కగా నిర్వహించేవారు. అన్నిచోట్ల కూడా ఎన్టీఆర్ కి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు. ఇక కొన్నిసార్లు షూటింగ్లకు వెళ్లేటప్పుడు కూడా ఎన్టీఆర్ను తీసుకొని మరి వెళ్లేవారట.
అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు తన కొడుకు పేరును తారకరత్నగా మార్చారు. ఈ విషయాలు హరికృష్ణ ఎన్నో సార్లు తెలియజేశారు. ఎన్టీఆర్ కు తన తల్లి శాలినితో మంచి అనుబంధం ఉన్నది..
తన తల్లి ఎన్టీఆర్ ను నిజజీవితంలో ఎప్పుడూ కూడా ఊహలలో బ్రతకవద్దా అని నిజజీవితంలోని వాస్తవాలతోనే బ్రతకాలని మంచి చెడుల గురించి తనకి ఎప్పుడు నేర్పిస్తూ ఉండేదట. ఇలా ఇండస్ట్రీలో తారక్ ఇంత మంచి గొప్ప స్థానం నుంచి చేరడానికి కారణం ఎన్టీఆర్ తల్లి శాలిని అని చెప్పవచ్చు. ఈమె నేర్పిన విద్యాబుద్ధులు ఎన్టీఆర్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు.