సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి స్టార్ హీరో హీరోయిన్లకైనా సర్వసాధారణం వాళ్ళ మధ్య ఏదైనా ఉన్నా లేకపోయినా .. వాళ్ళ మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం జరిగేది . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా సైలెంట్ గా ఉండే వెంకటేష్ సైతం ఓ హీరోయిన్ విషయంలో ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యాడు . ఆ హీరోయిన్ మరేవరో కాదు సౌందర్య . తెరపై సౌందర్య – వెంకటేష్ జోడి ఎంత సూపర్ సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
వీళ్ళ జంట కనపడితే విజిల్స్ ..కేకలు ..అరుపులు వినిపించేవి . అంత కెమిస్ట్రీ పండేది వీళ్ళ మధ్య. అయితే వీళ్ల కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని వెంకటేష్ – నీరజకు డైవర్స్ ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది . దీనితో సీరియస్ అయిన రామానాయుడు వాళ్ళిద్దరిని రూమ్ లోకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారట . అయితే అప్పుడే సౌందర్య..” సారీ సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు.. మా మధ్య అలాంటి బంధం లేదు. అవంతా కేవలం పుకార్లే “అంటూ చెప్పుకొచ్చిందట .
అయినా కానీ రామానాయుడు “మీ మధ్య ఏమీ లేకపోవచ్చు కానీ.. మీ మధ్య ఏదో ఉంది అని వస్తున్న వార్తలకు చెక్ పడాలి ..అంటే నువ్వు నా బిడ్డకు రాఖీ కట్టాలి” అంటూ రామానాయుడు – సౌందర్య చేత వెంకటేష్ కు రాఖీ కట్టించారట . ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . కానీ ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆ తర్వాత వెంకటేష్ – సౌందర్య తెరపై చాలా రేర్ గా కనిపించే వాళ్ళు. ఎన్నో సినిమాల్లో ఛాన్స్ వచ్చిన సౌందర్య వెంకటేష్ తో చేయను అని కరాకండిగా చెప్పేసిందట..!!