ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లుఅర్జున్ పేరు మారు మ్రోగిపోతుంది. దానికి కారణం రీసెంట్గా ఆయనకు ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు వరించడమే . రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులలో బన్నీకి ఉత్తమ జాతీయ నటుడిగా పుష్ప సినిమాకి గాను అవార్డు వరించింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ..సినిమా ఇండస్ట్రీలో.. వెబ్ మీడియాలో అల్లు అర్జున్ పేరు మారుమ్రోగిపోతుంది.
అయితే అల్లు అర్జున్ కి ముందే అవార్డు వస్తుందని ఓ హీరోయిన్ స్టేజి పైన నొక్కి చెప్పిన ఓల్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు రష్మిక మందన . ఎస్ రష్మిక మందన్నా పుష్ప2 సినిమాకి సంబంధించిన ఈవెంట్లో ఈ కామెంట్స్ చేసింది. “బన్నీ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని ..కచ్చితంగా ఈ సినిమాతో బన్నికి నేషనల్ అవార్డు వస్తుందని.. స్టేజి పైన చెప్పుకొచ్చింది “.
అయితే అప్పట్లో ఆ విషయాన్ని అందరూ చాలా లైట్ గా తీసుకున్నారు . కానీ ఫైనల్లీ రష్మిక మందన్న చెప్పింది నిజమైంది. ఫైనల్లీ అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చేసింది . దీనితో రష్మిక సైతం ఇదే విషయాన్ని మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు మరింత చేరువైంది.
View this post on Instagram