టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా పేరుపొందిన హీరోయిన్ ఆదాశర్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది .కానీ సరైన సక్సెస్ స్టార్ హీరోయిన్ స్టేటస్ను మాత్రం అందుకోలేకపోయింది.. కానీ ఈ కేరళ స్టోరీ సినిమాతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్న ఆదాశర్మ ఓవర్ నైట్ కి పాపులారిటీ సంపాదించుకుంది. తన నటనతో అందంతో ఒక గుర్తింపు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటుంది. తొలిసారిగా బాలీవుడ్ తో తన కెరీర్ ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 2014 హార్ట్ ఎటాక్ చిత్రం తో పరిచయమైంది.
ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కొన్నిసార్లు సెకండ్ హీరోయిన్గా కూడా నటించాల్సి వచ్చింది. తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ ,తమిళ్ భాషలలో కూడా నటించిన ఆదాశర్మ. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా ఇతర చిత్రాలలో బిజీగా ఉన్న ఈ ముగ్గు సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు ఈ మెసేజ్ చేసే ఫోటోలు కూడా అందరిని భయభ్రాంతులకు గురి అయ్యేలా చేస్తుంటాయి.
ఎక్కువగా దెయ్యాల లాగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి తన ఫోటోలను మూగజీవులతో దిగినటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఒక సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది.. అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకోగా ఆ ఫోటోలలో ఈమె తన చేతులకు కాళ్లకు గాయాలు అయినట్టుగా కనిపిస్తున్నాయి. అయితే ఇది స్కిన్ ఎలర్జీ అన్నట్లుగా పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఏదైనా డస్ట్ ఎలర్జీ కానీ, నీటి అలర్జీల వల్ల ఇది వచ్చి ఉంటుందని పలువురు నేటిజన్లు తెలియజేస్తున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం ఈ అమ్మడు త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram