సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా సరే .. అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన పేరు చెప్తే వచ్చే కిక్కే వేరు అంటున్నారు కుర్రాళ్ళు .”పుష్ప” సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ చేతిలో ఆరు ప్రాజెక్టులు పట్టుకొని ఉంది . నితిన్ తో ఓ సినిమా .. పుష్ప2 సినిమాలు చేస్తూ తెలుగులో మరో రెండు ప్రాజెక్ట్స్ ని హోల్డ్ లో పెట్టుకుని ఉన్న రష్మిక మందన్నా.. బాలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్స్ లో భాగమైంది.
రణబీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది రష్మిక మందన. ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ నుంచి మరో ఆఫర్ అందుకుంది . టాలీవుడ్ లో విక్రమార్కుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. బాలీవుడ్ లో విక్రమ్ రాథోడ్ అనే పేరుతో తెరకెక్కించారు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుందట . ఇందులో కూడా హీరోయిన్గా రష్మిక ని చూస్ చేసుకున్నారు మేకర్స్ .
అయితే బాలీవుడ్ లో – టాలీవుడ్ లో ఇంత మంది హీరోయిన్స్ ఉన్న ఎందుకు నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక నే సినిమాకి చూస్ చేసుకున్నారు అన్న క్వశ్చన్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినపడుతున్నాయి . అయితే రష్మిక మందన చాలా యాక్టివ్గా ఫీల్ అవుట్ అవుతూ సరదా సరదాగా ఉంటుందని .. ఏ డైరెక్టర్ అయినా ఆమెతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడని ..అలుపు లేకుండా రష్మిక ఎప్పుడు హై ఎనర్జీతో సెట్స్ లో కనపడడమే అందుకు కారణమని అందుకే.. ఆమె ఎనర్జీకి టెంప్ట్ అయిపోయి డైరెక్టర్స్ ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు అంటూ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు..!!