చిత్ర పరిశ్రమలో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న అతికొద్ది మంది హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.. చంద్రబాబు మేనల్లుడు ప్రముఖ వ్యాపారవేత్త నార్ని శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతితో ఎన్టీఆర్ వివాహం జరిగింది.. చిన్నతనం నుంచి హైదరాబాద్లోనే పెరిగిన ప్రణతి గ్రాడ్యుయేషన్ అనంతరం ఎన్టీఆర్ను వివాహం చేసుకుంది.
2011లో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. ఎన్టీఆర్ ఓ వైపు సినిమాలు మరోవైపు తన వివాహ జీవితాన్ని కూడా ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేస్తూ తన కెరియర్ లో దూసుకుపోతున్నాడు. ఏమాత్రం తనకు ఖాళీ సమయం దొరికిన తన ఫ్యామిలీతో ఫ్రీగా గడుపుతుంటాడు ఎన్టీఆర్.
అలాగే లక్ష్మీ ప్రతీ కూడా తన భర్తకు ప్రతి విషయంలో చాలా సపోర్ట్ గా ఉంటుంది. అందుకే టాలీవుడ్ లో ఈ జంట లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకుంది. ఇక ఈ విషయం పక్కన పడితే లక్ష్మీ ప్రణతి పెళ్లి సమయంలో తన అత్తవారింటికి భారీగా కట్న కానుకలను తీసుకొచ్చింది.. వేలకోట్లకు అధిపతి అయిన నార్ని శ్రీనివాసరావు తన అల్లుడు ఎన్టీఆర్ కు దాదాపు రూ.500 కోట్ల రూపాయలు దాకా కట్నం ఇచ్చారని తెలుస్తుంది.
అదేవిధంగా కూతురు లక్ష్మీ ప్రణతి పేరట రూ.1000 కోట్లకు పైగా ఆస్తులు రాసి ఇచ్చారట.. ఈ విధంగా లక్ష్మీపతి అత్తవారింటికి భారీగానే కట్నం తెచ్చిందని అంటున్నారు..ఇలా ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్న సమయంలో భారీగానే కట్న కానుకలు అందుకున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే గత ఏడాది `ఆర్ఆర్ఆర్`సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.
ఈ మూవీ ద్వారా ఇంటర్నేషనల్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా దేవర చేస్తున్నాడు.. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది.. ఈ సినిమాని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.