చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకుంది..మలయళ స్టార్ నిర్మత పీకేఆర్ పిళ్లై(92) మరణించరు. మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నా ఆయన గత కొంత కాలంగా అనార్యోగ్య సమస్యలతో భాద పడుతు త్రిసూర్ జిల్లా మందన్చిరలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.ఇక ఈయన మోహన్ లాల్తో ఎక్కువగా సినిమాలు నిర్మించారు.
షిర్డిసాయి క్రియేషన్స్ బ్యానర్పై అమృతం గమ్య (1987), చిత్రం (1988), వందనం (1989), కిజక్కునరుమ్ పక్షి (1991, అహం (1992)తో సహా మోహన్లాల్ హీరోగా ఎన్పో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలను అందించారు. పిళ్లై చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీ చిత్రమ్. ఈ సినిమాకి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. మోహన్లాల్ హీరోగా నటించారు. ఈ సినిమా తరువాత ఇతర భాషలో కూడా పలు సినిమాలు నిర్మించారు.
12 సంవత్సరాల క్రితం తన వ్యాపారాలన్నీ వదిలేసి మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి షిరిడి సాయి క్రియేషన్స్ బ్యానర్ను స్థాపించి.. వేప్రాళం అనే సినిమాను నిర్మించాడు. పీకుఆర్ పిళై భార్య రమ్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన మరణించడంతో ఒకసారిగా మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.