హీరోయిన్ రకుల్ నటీనటులపై షాకింగ్ కామెంట్స్..!!

ఇటీవల కాలంలో ఎ ఇండస్ట్రీలోనైనా ఎక్కువగా పురుషాధిక్యత గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు రెమ్యూనరేషన్ విషయంలో చాలా తక్కువగా ఇస్తున్నారని కొంతమంది నటి మనుల పైన చాలా చిన్నచూపు చూస్తున్నారు అని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో కూడా మేల్ డామినేషన్ పై నిరంతరం ఎప్పుడు ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. మన స్టార్ హీరోలు ప్రస్తుతం రూ .100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు.

Rakul Preet Singh Stuns In Lilac Sequins, Check Out Her Gorgeous Saree  Looks - In Pics | News | Zee News
అయితే హీరోయిన్ల రెమ్యూనరేషన్ పైన ఇటీవల కూడా కాస్త తగ్గించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పలువురు కథానాయకుల సైతం ఇప్పటికే పురుషాధిక్యత గురించి రెమ్యూనరేషన్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే అందుకు భిన్నంగా హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఒక బహిరంగ వేదిక పైన తన వాదనను వినిపించింది.. వాస్తవానికి ప్రజల్ని థియేటర్కు రప్పించగలిగే సామర్థ్యం తర్వాతే రెమ్యూనరేషన్ నిర్ణయించాలి.. కానీ లింగం కాదు అని వాక్యానించింది.. ప్రేక్షకులను థియేటర్ కి రప్పించగలిగే సామర్థ్యం ప్రతిదీ నిర్ణయించాలని ఆడవారు మగవారు అని తేడా లేకుండా చూడాలని రకుల్ ప్రీతిసింగ్ కామెంట్లు చేయడం జరిగింది.

ఇటీవలే సీటాడెల్ ప్రచారంలో భాగంగా ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలు మద్దతుగా రకుల్ ఈ విధంగా వాక్యానించినట్లు తెలుస్తోంది. తన 22 సంవత్సరాల కెరియర్లలో తన సహనటుడుతో సమానంగా పారితోషకం చెల్లించిన మొదటి ప్రాజెక్ట్ ఇదేనని ప్రియాంక చోప్రా తెలిపింది. ఆడ మగ అనే భేదం లేకుండా చూడాలని తెలియజేస్తోంది.FICCI ఫ్రేమ్స్ 2023 లో ఉమెన్ ఇన్ సినిమా చర్చ కార్యక్రమంలో రకుల్ ఈ విధంగా కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.