డైరెక్టర్ ప్రశాంత్ నిల్, హీరో యశ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. కన్నడ సినీ ఇండస్ట్రీ ఇన్ని అద్భుతాలు చేస్తుందా అని ఆశ్చర్యపరిచేలా ఈ సినిమా పలు రికార్డులను సైతం సృష్టించింది. ఈ చిత్రంలో నటించిన నటీమణులందరూ దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ అందుకున్నారు. ఇందులో నటించిన ఆండ్రి మాళవిక అవినాష్ కూడా ఒకరు.
ముఖ్యంగా ఈమె చెప్పే డైలాగులు కే జి ఎఫ్ సినిమాలో అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. వాస్తవానికి కేజిఎఫ్ సినిమాను మొదట నడిపించేది ఆండ్రి మాళవిక అవినాష్ అనే చెప్పవచ్చు.ఈమె చాలా కన్నడ సినిమాలలో సీరియస్ లో కూడా నటించింది కే జి ఎఫ్ సినిమా తెచ్చిన గుర్తింపుతో ఈమె మంచి పాపులారిటీ సంపాదించింది. ఈమె నిజ జీవితంలో మాత్రం పలు విషాదాలు దాగున్నాయని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
మాళవిక కుమారుడు ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడట. దీనివల్ల 20 ఏళ్ల వయసులో చిన్నపిల్లాడిలానే ఉండిపోయాడట. తన పనులు తాను చేసుకోలేని స్థితిలో అతను ఉన్నాడని ఒక తల్లికి ఇంతకు మించి నరకం ఉంటుందా అంటు మాళవిక నిత్యం కుమిలిపోతూ ఉంటుందట.. ఇక దేవుడు తనకెందుకు ఇలాంటి శిక్ష వేశాడు అంటూ ఒక్కోసారి తనకు గుండెల్లో బాధ అనిపిస్తుందని ఒక టీవీ షోలో ఈ విషయాన్ని తెలియజేసింది. ఈమె కొడుకు ఓల్ఫ్ హేర్షన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. కొంతకాలం క్రితమే ఈ విషయం తమకు తెలిసిందని మొదట్లో డాక్టర్లు దీని గురించి మాకు అసలు చెప్పలేదని తెలిపింది.ఈ వ్యాధి ఉంటే బుద్ధి మాన్యం వస్తుందని మాట్లాడలేరని నడవడం కూడా ఇబ్బంది అని తెలియజేసింది. ఇది కేవలం మా బ్యాడ్ లక్ అని డాక్టర్లు అన్నారని తెలిపింది.