ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో జాన్వి కపూర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో కొత్తగా చెప్పక్కర్లేదు . పేరుకు స్టార్ డాటర్ అయినా సరే ..సినిమాల కంటే సోషల్ మీడియాలోనే యమ యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకున్న జాన్వి కపూర్ .. రీసెంట్ గానే తెలుగులో డెబ్యూ సినిమాకు సైన్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాలో జాన్వికపూర్ ఫస్ట్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది .
ఇదే విషయాన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు కొరటాల శివ. జాన్వీ బర్తడే బాడు గ్రాండ్ గా అనౌన్స్ చేశారు . ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వని జాన్వి కపూర్ అంతలోనే సెకండ్ తెలుగు సినిమా ఆఫర్ ని కూడా సైన్ చేసింది అంటూ ఓ న్యూస్ వైరల్ అయింది . బుచ్చిబాబు డైరెక్షన్లో రాంచరణ్ హీరోగా ఓ సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలోను జాన్వి కపూర్ హీరోయిన్గా ఫిక్స్ అయింది అంటూ ఆల్మోస్ట్ ఆల్ కన్ఫామ్ అయిపోయింది . కాగా రీసెంట్గా మరో స్టన్నింగ్ న్యూస్ జాన్వికపూర్ కి సంబంధించి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . త్వరలోనే తెరకెక్కబోతున్న దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో కూడా జాన్వీ హీరోయిన్గా నటిస్తుంది అంటూ తెలుస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని.. వాళ్ళలో ఒకరే జాన్వి కపూర్ అని వైరల్ అవుతుంది . అందుకే జాన్వి కపూర్ ఎన్టీఆర్ 30 లాంచింగ్ ఈవెంట్లో రాజమౌళితో అంత క్లోజ్ గా మూవ్ అయిందట. అంత చనువుగా వాళ్ళు మాట్లాడుకున్నారు అని తెలుస్తుంది. ఒక్క దెబ్బతో మూడు సినిమాలకు వరుసగా సైన్ చేయించి జాన్వి కపూర్ ని స్టార్ ని చేసేసాడు బోనీ కపూర్ అంటున్నారు జనాలు..!!