యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి డైరక్షన్లో వచ్చిన సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్, రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఎన్టీఆర్ కూడా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా ఇంత పెద్ద ఇండస్ట్రీ హీట్ అయినా ఈ సినిమాలో మొదట ఎన్టీఆర్ హీరో కాదట, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించిన ఈ స్టోరీని ముందుగా బాలకృష్ణకి చెప్పారట. ఆ సమయానికి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి పవర్ ఫుల్ సినిమాలు చేసిన బాలయ్య ఈ స్టోరీకి నో చెప్పారట.
ఆ తర్వాత రాజమౌళి ఇదే స్టోరీని ప్రభాస్ కి చెప్పగా.. ప్రభాస్ ఈ స్టోరీ విని కొంత టైమ్ కావాలని అడిగాడట, దాంతో కొంత సమయం వెయిట్ చేసిన రాజమౌళి ఎంత సమయం గడుస్తున్న ప్రభాస్ నుంచి సమాధానం రాకపోవడంతో.. తన తండ్రి సూచనతో ఎన్టీఆర్ కి ఈ స్టోరీ చెప్పి ఆయనతో ఈ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తర్వాత ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్లో ఛత్రపతి, బాహుబలి సినిమాలు వచ్చాయి. కానీ సింహాద్రి సినిమాని మిస్ చేసుకున్నందుకు ప్రభాస్ ఇప్పటికీ చాలా బాధపడుతున్నాడట.
ఇక సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ కి నందమూరి అభిమానులో విపరీతమైన క్రేజ్ కూడా వచ్చింది. ఈ సినిమా దగ్గర నుంచే ఎన్టీఆర్ను నందమూరి కుటుంబం దగ్గరకు తిసుకుంది అని కూడా అంటారు. అప్పటి నుంచే మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ కూడా పెంచుకున్నాడు. ఇక రాజమౌళి- ఎన్టీఆర్ కాంబోలో ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చి అవి కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారడం లో ముఖ్య పాత్ర రాజమౌళి అనే చెప్పాలి.