“ఇస్మార్ట్ శంకర్” సినిమా ని చేతులారా వదులుకున్న ఆ తెలుగు హీరో ఎవరో తెలిస్తే.. తలలు బాధుకుంటారు..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే కుదురుతాయి ..సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ..ఆ డైరెక్టర్ ఆ హీరో కాంబో అంటే మాత్రం జనాలు ఎగబడి పోతారు. వాళ్ళల్లో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సుకుమార్ – బన్నీ, త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ – రాజమౌళి ఇలాంటి కాంబోలో పడితే సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేయాల్సిందే . కాగా ఒకప్పుడు తన డైరెక్షన్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనందరికీ తెలిసిందే…

ఏది ముట్టుకున్న బ్లాస్ట్ అవుతుంది.. పాపం పూరి జగన్నాథ్ ఏ తప్పు చేస్తున్నాడో తెలియడం లేదు కానీ భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన అన్ని సినిమాలు బోల్తా కొడుతున్నాయి . అయితే ఈ మధ్యకాలంలో ఆయన డైరెక్ట్ చేసి రిలీజ్ చేసిన హిట్ అయిన ఒకే ఒక్క సినిమా ఇస్మార్ట్ శంకర్ . ఈ సినిమాతోనే మళ్లీ పుంజుకుంటాను అన్న ఆశలను పెంచుకున్నాడు పూరి జగన్నాథ్ ..అయితే లైగర్ సినిమాతో ఆ ఆశలన్నీ తుస్సు మని పోయాయి.

పూరీ డైరెక్షన్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలాంటి హిట్ అందుకునిందో అందరికీ తెలిసిందే. మాస్ మాసివ్ హిట్ అనే చెప్పాలి . మరి ముఖ్యంగా రామ్ లాంటి క్లాస్ హీరోను మాస్ యాంగిల్ లో కూడా చూపించచ్చు అని ప్రూవ్ చేశాడు పూరి జగన్నాథ్. అయితే మొదటిగా ఈ సినిమా స్టోరీ అనుకున్నప్పుడు హీరోగా ఊహించుకునింది టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ను అంటూ తెలుస్తుంది .

విజయ్ దేవరకొండ కే ఈ కథను ముందు చెప్పాడట పూరి జగన్నాథ్. అయితే అప్పటికే బిజీగా ఉన్నా విజయ్ దేవరకొండ ..ఈ సినిమా కథను విన్నా ..నచ్చిన చేయలేకపోయాడట . ఎక్కువ కాలం ఆగలేకపోయినా పూరి జగన్నాథ్ .. ఎనర్జిటిక్ హీరో రామ్ తో సినిమాను ఫినిష్ చేసి హిట్ అందుకున్నాడు . నిజంగా ఈ పాత్రకు రామ్ కంటే విజయ్ దేవరకొండ అదిరిపోయే న్యాయం చేసేవాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నాడు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నవ్ రౌడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ప్రస్తుతం విజయ్ శివనిర్వాణ డైరెక్షన్లో “ఖుషీ” సినిమాలో నటిస్తున్నాడు . అంతే కాదు ఈ సినిమా అయిపోయిన వెంటనే గౌతమ్ తిన్నురి డైరెక్షన్లో ఇంకో క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ కి కమిటీ అయ్యాడు రౌడీ హీరో..!!