“వాల్తేరు వీరయ్య” పబ్లిక్ టాక్ : సినిమా కి వెళ్ళే వాళ్ళు దాన్ని మర్చిపోకుండా తీసుకెళ్లండ్రా బాబులు..!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా అందాల ముద్దుగుమ్మ స్టార్ డాటర్ శృతిహాసన్ హీరోయిన్గా నటించిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం వాల్తేరు వీరయ్య . బాబి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్స్ లో రిలీజ్ అయింది. కాగా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా హ్యూజ్ పాజిటివ్ టాక్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పెర్ఫార్మెన్స్ ఇరగదీసాడనే చెప్పాలి.

ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాని మరో మెట్టు ఎక్కించిందనే చెప్పాలి . తెరపై మాస్ మహారాజ రవితేజ చిరంజీవి కలిసి పోటాపోటీగా డైలాగ్స్ చెప్తున్నప్పుడు మెగా ఫాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి . అంతేకాదు సినిమాలో గ్లామర్ పరంగా శృతిహాసన్ కేథరిన్ లు కూడా ఎక్కడ తగ్గేదేలే అన్న రేంజ్ లో అందాలు ఆరబోశారు. అయితే సినిమాలో ఎవరికీ తగ్గ పాత్రల్లో వాళ్ళు పూర్తి న్యాయం చేసినప్పటికీ సినిమా గురించి నెగటివ్ కామెంట్స్ వినిపించడానికి మెయిన్ రీజన్ డిఎస్పి అనే చెప్పాలి .

మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాకి ఎక్కడో జాతరలో కొన్న పీకను తీసుకొచ్చి మ్యూజిక్ ఇవ్వడం ఏంట్రా బాబు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు సినిమా మొత్తానికి మ్యూజిక్ డిజాస్టర్ గా మారింది .కథ పరంగా అక్కడక్కడ సాగదీసిన మెగాస్టార్ చిరంజీవి – రవితేజ తమ పర్ఫామెన్స్ తో నెట్టుకొచ్చారు . అయితే మ్యూజిక్ విషయంలో మాత్రం దేవిశ్రీప్రసాద్ పూర్తిగా ముంచేసాడని అంటున్నారు మెగా ఫాన్స్ . అంతేకాదు కొంతమంది యాంటీ ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ..”సినిమా చూడాలి అనుకుంటున్న జనాలు థియేటర్స్ కి వెళ్లేటప్పుడు ఆ పీకను మర్చిపోకుండా తీసుకెళ్లండి ” అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వాల్తేరు వీరయ్య సినిమాపై సోషల్ మీడియాలో అక్కడక్కడ నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా సరే చాలా రోజుల తర్వాత మాస్ లుక్ లో కనిపించి మెగా అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేసాడు చిరంజీవి . చూడాలి మరి ఈ సినిమా ఏ విధంగా కలెక్షన్స్ సాధిస్తుందో..?