“ఆ హీరో అభిమానులు నన్ను చంపేస్తారు అని భయపడిపోయా”..వరలక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్..!!

టాలీవుడ్ నందమూరి హీరో బాలయ్య లేటెస్ట్ గా నటించిన చిత్రం వీర సింహారెడ్డి . గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన భారీ సంఖ్యలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్గా స్టార్ట్ డాటర్ శృతిహాసన్ , మలయాళం ముద్దుగుమ్మ హనీ రోజ్ నటించారు ,

అయితే సినిమాలో కత్తిలాంటి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా కానీ జనాల అటెన్షన్ మొత్తం తనపై పడేలా చేసుకునింది స్టార్ డాటర్ వరలక్ష్మి శరత్ కుమార్ . ఈ సినిమాలో ఆమె లేడీ విలన్ పాత్రలో నటించి మెప్పించింది . బాలకృష్ణ చెల్లెలిగా ఆయనపై పగ తీర్చుకునే ఆడబిడ్డగా వరలక్ష్మి శరత్ కుమార్ చూపించిన పర్ఫామెన్స్ చేసిన నటన అభిమానులను ఆకట్టుకుంది . అయితే రీసెంట్గా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్య ఫ్యాన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది .

ఇంటర్వెల్ సీన్ లో బాలయ్యను పొడిచి చంపే టైంలో బాలయ్య అభిమానులు నన్ను ఎక్కడ చంపేస్తారో అంటూ భయపడ్డానని చెప్పుకొచ్చింది. అఫ్కోర్స్ ఈ వ్యాఖ్యలు సరదాగా చేసిన కొంతమంది నందమూరి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు . ఫ్యాన్స్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అంటూ మండిపడుతున్నారు . చాలామంది స్టార్ హీరోస్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోని ఏమన్నా అంటే ఒప్పుకోరు .. అలా అని చంపేస్తామా అంటూ ఫైర్ అవుతున్నారు..!!