ఒకే పరిశ్రమ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలని ఒకే సీజన్లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తే ఎలా ఉంటుందో ఈ సంక్రాంతికి చూసాం. ఒక రోజు తేడాతో బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందు థియేటర్ల విషయంలో ఎంతో పెద్ద రచ్చ జరిగింది.
ఓకే చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరోజు తేడాతో వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకే ఇలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు.. ఒకే రోజున ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే టాప్ మోస్ట్ స్టార్ హీరోలు తమ సినిమాలను ఒకే రోజున రిలీజ్ చేస్తే ఇంకెలా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఆగస్టు 11న ఇదే సీన్ రిపీట్ అవ్వబోతుంది.
టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ స్టార్ట్ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘SSMB 28’ సినిమాను మహేష్ పుట్టినరోజు కానుకగా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని ఈ సినిమా నిర్మాత నాగవంశి ఇప్పటికేే ప్రకటించాడు. పాన్ ఇండియా స్థాయిలో మహేష్ నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. ఇక బాలీవుడ్ నుంచి మరో స్టార్ హీరో రణ్బీర్ కపూర్ కూడా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అర్జున్ రెడ్డి ఇలాంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ‘అనిమల్’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో సౌత్ లో కూడా తన హవా చూపించాలని రణ్బీర్ ప్లాన్ చేస్తున్నాడు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ సినిమా కూడా ఆగస్టు 11న ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇక ముందుగా ఈ సినిమాను ఈ సమ్మర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేసిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టు కు పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్ రేంజ్ సూపర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని రజనీకాంత్ కూడా ఈ సినిమాను ఎంతో ఇష్టంగా చేస్తున్నాడు. ఇక ఇండియాలోనే అగ్ర చిత్ర పరిశ్రమల నుంచి ముగ్గురు స్టార్ హీరోలు ఒకే రోజున ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఈ మూడు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయటం అయితే గ్యారెంటీ.