జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో సూపర్ క్రేజ్తో అదరగొడుతున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలుకు కమిట్ అవుతూ తన అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించాడు. వచ్చేనెల ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది. ఇక 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వైరల్ గా మారింది. కొరటాల శివ సినిమా అంటేనే యాక్షన్ సన్నివేశాలతో పాటు సమాజానికి అవసరమయ్యే మెసేజ్ కూడా ఉంటుంది. కొరటాల గత సినిమా ఆచార్య డిజాస్టర్ గా నిలవడానికి ప్రధాన కారణం తన మార్క్ సన్నివేశాలు లేకపోవడం. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాలో కొరటాల తన మార్క్ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎన్టీఆర్ ని మునుపెన్నడూ చూడని రీతిలో ఓ కొత్త క్యారెక్టర్లో చూపించబోతున్నాడని తెలుస్తుంది.
ఎన్టీఆర్ ఈ సినిమాలో కొంత సమయం పాటు జాలరిగా కూడా కనిపిస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా చిరు జాలరిగా కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాలో తన పాత్రకూడా చిరు పాత్రను పోలి ఉంటుందని టాలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఈ సినిమాలో సముద్ర జలాల గురించి కూడా చర్చ ఉంటుందని సమాచారం అందుతుంది.
ఎన్టీఆర్కు జంటగా జాన్వీ కపూర్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రాలేదు. ఈ సినిమా ఎన్టీఆర్ గత సినిమా త్రిబుల్ ఆర్ కు మించి అదిరిపోయే రీతిలో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ తన 31వ సినిమాని పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్తో చేయబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్ కూడా విడుదలవుగా.. ఎన్టీఆర్- కొరటాల సినిమా పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్ ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తారు చూడాలి.