నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లకు కూడా ఫుల్ జోష్లో జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ బాలయ్య అభిమానులను ఊపేస్తున్నాయి. ఇక తాజాగా నిన్న ఒంగోల్లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఇక అక్కడ ఈ సినిమా ట్రైలర్ను కూడా విడుదల చేశారు.
అసలే బాలకృష్ణ సినిమాలంటే డైలాగులు పంచ్లు ఏ రేంజ్ లో ఉంటాయో మన అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అసలే ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ఈ వీరసింహారెడ్డి లో కూడా అదిరిపోయే పంచ్లతో అదరగొట్టాడు. ఇక ట్రైలర్లో డైలాగ్ లు, పొలిటికల్ పంచులతో బాలయ్య ఇరగదీసాడు. ఈ ట్రైలర్ లోనే రెండు డైలాగులు అయితే ఏపీ సీఎం జగన్కే కావాలనే వేసినట్టు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా “సంతకాలు పడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు”. ఈ డైలాగ్ వినగానే అభిమానులు ఎవరికో వార్నింగ్ ఇచ్చి ఉంటాడో తెలుసా అని అభిమానులు తెగ కొట్టేసుకుంటున్నారు.
ఇక ఈ క్రమంలోనే గత సంవత్సరం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ఆంధ్రప్రదేశ్ లో ఎంత సంచలనంగా మారిందో.. ఆ సమయంలోనే ఈ ఘటన పెను వివాదాన్ని సృష్టించింది. నందమూరి కుటుంబం మొత్తం ఈ ఘటనను ఖండిచింది. ఇక ఇప్పుడు ఈ డైలాగ్ ను బాలయ్య వారి కోసమే ఏరి కోరి రాయించుకున్నాడని నెటిజన్లు అంటున్నారు.
ఇందులో మరో డైలాగ్… “పదవి చూసుకుని నీకు పొగరేమో… బైబర్త్ నా డిఎన్ఏ కే పొగరు” అని బాలయ్య ఎంతో పౌరుషంగా చెప్పుకురావడం కూడా హైలెట్గా నిలిచింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చాకా కొంత మంది రాజకీయ నాయకులు పోగరు చూపిస్తున్నారని బాలయ్య ఒక్క డైలాగ్ తోనేె వారికి వార్నింగ్ ఇచ్చినట్టు చూపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ టైలర్ రెండు తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలూగుస్తుంది. ఇక ఈ ట్రైలర్ విడుదలైన గంటలోనే 1 మిలియన్ కు పైగా వ్యూస్ ని దక్కించుకుని బాలయ్య అదిరిపోయే రికార్డును సృష్టించాడు. ఇక ఈ డైలాగ్స్ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హిట్ పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక బాలయ్య ఈ ఊర మాస్ డైలాగ్లా ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.