నెట్‌ఫ్లిక్స్ కి మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీ.. ఎన్ని కోట్ల‌కు డీల్ క్లోజ్ అయిందో తెలిస్తే షాకే!?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖ‌లేజా తరువాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ ప్రాజెక్ట్ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే, యంగ్‌ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇటీవలె సెట్స్‌ మీదకు వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే చిత్రీకరణ పూర్తికాకముందే క‌ళ్లు చెదిరే ధ‌ర‌కు ఈ మూవీ యొక్క ఓటీటీ డీల్‌ క్లోజ్ అయింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ తాజా సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది.

థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. అయితే భారీ రేటుకే మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ మూవీ డిజిట‌ల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంద‌ట‌. ఈ మూవీ అన్ని భాష‌ల ఓటీటీ హ‌క్కుల‌ను ఏకంగా రూ. 80 కోట్లు చెల్లించి నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంద‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు.