నందమూరి ఫ్యాన్స్ కు ఊపు తెప్పించే న్యూస్.. సెన్సార్ పూర్తి చేసుకున్న బాలయ్య వీర సింహారెడ్డి..!

నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్‌ తర్వాత నటిస్తున్న సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్‌గా ఒంగోలులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించాడు. ఇక ఎప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ వచ్చింది.

ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాతో బాలకృష్ణ మరో సెన్సేషనల్ హిట్ కొట్టబోతున్నాడు అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమా షూటింగ్ కూడా మొద‌లు పెట్టి ఇప్ప‌టికే తోలి షెడ్యుల్ షూటింగ్‌ని కూడా ప్ర‌ర్తి చేసుకున్న‌డు. బాల‌య్య ఇప్పుడు వీర‌సింహ‌రెడ్డి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.