కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా.. ఈసారి బాక్సాఫీస్ కు దబిడి దిబిడే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటించబోయే తాజా చిత్రం NTR30 ఈ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివ తో చేయబోతున్నాడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి చాలా రోజులు అవుతున్న ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టబోతున్నామని చిత్ర యూనిట్ న్యూ ఇయర్ కానుకగా ఆప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాని కూడా ఎన్టీఆర్ రేంజ్ కు తగ్గట్టు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా ఎవరు నటిస్తున్నారనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు విలన్ గా బాలీవుడ్ అగ్ర హీరోలు నటిస్తున్నారని వార్తలు కూడా బయటకు వచ్చాయి. అందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్‌కు విల‌న్‌గా కన్ఫర్మ్ అయ్యాడనే వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ కు విలన్ గా హాలీవుడ్ నటుడు నటించబోతున్నారని తెలుస్తుంది.

త్రిబుల్ ఆర్ సినిమాతో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్‌కు మంచి ఫాలోయింగ్ వచ్చింది. త్రిబుల్ ఆర్ సినిమాలోని కొమరం భీమ్‌ పాత్రలోని ఎన్టీఆర్ నటనకు గాను హాలీవుడ్ నుంచి ఎన్నో ప్రసంసలు కూడా వచ్చాయి. ఆయన ఆస్కార్ నామినేషన్ లో కూడా మొదటి స్థానంలో ఉన్నారంటూ హాలీవుడ్ మీడియా వారు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. తాజాగా ఈరోజు ఆస్కార్ నామినేషన్ల తుది జాబితా విడుదల చేయనున్నారు. అందులో ఎన్టీఆర్ పేరు కచ్చితంగా ఉంటుందని ఎన్టీఆర్ అభిమానులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.

కొరటాలతో ఎన్టీఆర్ చేయబోయే సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ క్యారెక్టర్ కు తగ్గ నటుడు కోసం కొరటాల సెర్చింగ్ ఇప్పటికే మొదలుపెట్టాడు. కొరటాల ఈ సినిమాలో నటీనటుల ఎంపిక చేస్తున్న విధానం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది.. పైగా జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ ఎన్టీఆర్- కొరటాల కలయికలో సినిమా వస్తుందంటే ఆ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్ అందాల భామ‌ జాన్వీ కపూర్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.