తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి తెలుగు తేరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా వెలగడంతో పాటు విపరీతమైన క్రేజీని సంపాదించుకుంది. ఈ క్రేజీతోనే ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా కూడా పేరు పొందింది. గత ఏడాది వరస ప్లాపులతో సతమతమైన రష్మిక ఏడాది మొదట్లోనే వరీసు చిత్రంతో మంచి హిట్ అందుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
రష్మిక మొదట నాగశౌర్యతో కలిసి ఛలో సినిమాలో నటించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి గీతాగోవిందం సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ వెంటనే మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి స్టార్ క్రేజీ ని అందుకుంది. ఇక పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్గా కూడా పేరుపొందింది ఈ ముద్దు గుమ్మ. అలా బాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక కు వరుస ప్లాపులు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రష్మిక పుష్ప-2 చిత్రంలో నటించేందుకు సిద్ధంగా ఉంది.
ఇక తమిళంలో కార్తి నటించిన సుల్తాన్ సినిమాలో తమిళ తెరకు పరిచయమైంది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. తాజాగా విజయ్ దళపతి నటించిన వారిసు చిత్రంతో మరొకసారి తమిళ ప్రేక్షకులను అలరించిన ఈమె పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో మొదటిసారి తమిళంలో హిట్ సినిమా తన ఖాతాలో వేసుకుంది రష్మిక. మరి రాబోయే రోజుల్లో తమిళంలో కూడా తన హవా కొనసాగిస్తుందేమో చూడాలి మరి రష్మిక. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.