రికార్డు వ్యూస్‌తో దుమ్మురేపిన అన్‌స్టాప‌బుల్ 5వ ఎపిసోడ్‌… కౌంట్ చూస్తే మైండ్ దొబ్బాల్సిందే..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాత‌గా చేస్తున అన్‌స్టాపబుల్ షో ఎవ‌రు ఉహించ‌ని రికార్డులు క్రియెట్ చేస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమవుతోన్న ఈ టాక్‌షోకు అదిరిపోయే రేంజ్‌లో ఆదరణ ఉంటోంది. రీల్‌, రియల్‌ లైఫ్‌లోనూ ఎంతో సీరియస్‌గా కనిపించే బాలయ్య ఈ టాక్‌షోలో మ‌త్రం తనలోని కొత్త బాల‌య్యని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. అదిరిపోయే పంచుల‌తో అతిథులను ఆటపట్టిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఓటీటీ వ్యూస్‌పరంగా రికార్డులు కొల్లగొడుతోన్న అన్‌స్టాపబుల్‌ ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా మొదటి సీజన్ ను కంప్లిట్‌ చేసుకుంది.

ఇప్పుడు జ‌రిగే రెండో సీజన్‌ కూడా అంతకుమించి అనేలా కోన‌సాగుతోంది. ఈసీజన్‌లో సిని తారలతో పాటు మాజీ సీఎంలు చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి గెస్ట్‌లుగా రాజకీయ ప్రముఖులుగా అన్‌స్టాపబుల్ షోలో సందడి చేశారు. అలాగే వారితో పాటు యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, శర్వానంద్, అడవి శేష్ లూ కూడా బాలయ్య షోకు వచ్చి బాల‌య్య‌తో ర‌చ్చ చేశారు. తాజాగా అన్‌స్టాపబుల్‌ 2 ఐదో ఎపిసోడ్‌కు టాలీవుడ్‌ లెజెండరీ దర్శక, నిర్మాతలు కె. రాఘవేంద్రరావు, డి. సురేష్ బాబు, అల్లు అరవింద్, ఏ. కోదండరామిరెడ్డి గెస్ట్‌లుగా వ‌చ్చారు. డిసెంబర్‌2 రాత్రి ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ అయ్యింది.

అ ఎపిసోడ్‌ను తెలుగు సినిమాకు 90 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను రూపొందించారు. వారు తమ సినిమా జీవితంలోని విశేషాలను, అనుభవాలను ఈ ఎపిసోడ్‌లో పంచుకున్నారు. రాఘవేంద్రరావు, సురేశ్‌బాబు, అరవింద్‌, కోదండరామిరెడ్డి. ఇక‌ ఎప్పటిలాగే బాలయ్య తనదైన కామెడీ పంచులతో షోను మరింత రక్తికట్టించారు. ఇలా ఎంతో ఆహ్లాదకరంగా సాగిన నాలుగో ఎపిసోడ్‌ వ్యూస్‌ పరంగా రికార్డులు సృష్టించింది.

Watch Unstoppable 2 Episode 5 on aha in HD Quality Stream Now.

ఈ ఎపిసోడ్‌ కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 30 మిలియన్ల స్ట్రీమింగ్ వ‌చ్చిన‌ట్లు ఆహ టీమ్ తెలిపింది. కాగా ఇప్పుడు అన్‌స్టాపబుల్‌ తర్వాతి ఎపిసోడ్‌లో ఎవరు రానున్నారనేది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ సీనియర్‌ హీరోయిన్లు అయ‌న‌ జయసుధ, జయప్రదతో పాటు ప్రభాస్‌, గోపిచంద్ కూడా అన్‌స్టాపబుల్ షో కు హాజరుకానున్నరని టాక్‌ వినిపిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భ‌స్, గోపిచంద్ ఎపిసోడ్ ను ఈనెల 11నుండి మొద‌లు కానుంద‌ని టాక్ న‌డుస్తుంది ఇక ఈ విష‌య‌ల‌పై త్వరలోనే ఈ వార్తలపై అధికార ప్ర‌క‌ట‌న రానుంది.